Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

crop loan waiver: లక్షణంగా రూ. లక్షా రేపే విడుదల

–తొలి విడతగా రూ.లక్ష వరకు రుణాలకు వర్తింప
–పాస్‌బుక్‌ ఉన్న ప్రతి రైతు ఖాతా లో జమ
–కుటుంబాన్ని గుర్తించడానికి మాత్ర మే రేషన్‌కార్డు
–రేషన్‌ కార్డుల్లేని 6.36 లక్షల మం దికీ రుణమాఫీ
–బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే చర్యలు
–అర్హులందరికీ ‘ఆరోగ్యశ్రీ’, ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌
–ఆగస్టు 15లోగా ‘ధరణి’ సమ స్యలు పరిష్కరించాలి
–ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్‌ చేయాలి
–కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

crop loan waiver:ప్రజా దీవెన, హైదరాబాద్‌: పంట రుణాల మాఫీపై (Farmers on crop loan waiver) రైతులకు ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (revanth reddy)మరో తీపి కబురు (goodnews) అందించారు. ఊహించిన దానికన్నా ముందే ఈ నెల 18 గురువారం నుంచే రుణమాఫీ పథకాన్ని (Loan waiver scheme) అమలు చేస్తామని ప్రకటించారు. రూ.లక్ష లోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సా యంత్రం కల్లా రైతుల బ్యాంకు ఖా తాల్లో వేస్తామని ప్రకటించారు. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల రుణమాఫీ పథకం వర్తిస్తుందని చెప్పారు. కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకుం టామన్నారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. రేషన్‌ కార్డులు లేని 6.36 లక్షల మందికీ రుణాలు ఉన్నాయని, వా రికి కూడా రుణమాఫీ వర్తి స్తుందని తెలిపారు. రేషన్‌ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.

అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డు లు.. …అర్హులందరికీ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డులు అందేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్‌ కార్డుకు, ఆరో గ్యశ్రీ (For ration card, Arogyashri)కార్డుకు లింక్‌ పెట్టొద్దన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందించాలని నిర్దేశించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో (Collectors, Commissioners of Police, Superintendents of Police) సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం.. రెండు సెషన్లుగా రాత్రి 7.20 గంటల వరకు దాదాపు 10 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం పూట సమావేశంలో మొత్తం కలెక్టర్ల పనితీరు, వారికి దిశా నిర్దేశం చేయడంపైనే సీఎం దృష్టి పెట్టారు. సాయంత్రపు సమావేశంలో కూడా పలు పథకాలపై దిశా నిర్దేశం చేశారు.