Deputy CM Bhatti Vikramarka : ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రణాళి కాబద్ధం, ప్రతిష్టాత్మకంగా సమ్మక్క, సారలమ్మ జాతర
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్:సమ్మక్క, సారలమ్మ జాతర గోదావ రి పుష్కరాలు ప్రతిష్టాత్మ కంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి కొండ సురేఖ అధి కారులకు సూచించారు. మంగ ళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమా వేశంలో భాగంగా దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల సమా వేశం నిర్వహించారు. వందల కోట్ల రూపాయల తో చేపడుతున్న పను లు భవిష్యత్తులోనూ ఉపయోగ పడేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేప ట్టాలంటే ఇప్పటినుంచే అధికా రు లు అందుకు సంబంధించిన కస రత్తు ప్రారంభించాలని తెలిపారు.
రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నందున దేశవ్యాప్తం గా పర్యాటకులను ఆకర్షించే వి ధంగా ప్రణాళికలు సిద్ధం చేయాల ని డిప్యూటీ సీఎం, మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. హైద రాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్క్ లను అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు వారాం తాల్లో సేద తీరేందుకు ఉపకరిస్తా యని తెలిపారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాలు, అర్బన్ పార్కులు అభివృద్ధి చేసుకోవడం ద్వారా శాఖలకు ఆలయం సమకూరు తుందని తెలిపారు. పురాతన దేవాలయాలను పునరుద్ధరించే పనులను ఆర్కియాలజీ డిపార్ట్మెం ట్ చేపట్టాలని డిప్యూటీ సీఎం సూ చించారు. దేవాలయాల ద్వారా ప్రజల్లో భక్తి భావన పెరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేయూతగా ఉంటుందని తెలిపారు. ప్రజల్లో భక్తి భావన పెంపొందితే క్రమశిక్షణకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాల అభివృ ద్ధికి పాస్టర్ ప్లాన్ ల రూపకల్పనపై మంత్రులు చర్చించారు. అటవీ హ క్కు చట్టం ద్వారా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూ ములకు పట్టాలు ఇచ్చామని, వారు సాగు చేసుకుంటున్న నేప థ్యంలో అటవీ శాఖతో సమన్వ యం లేకపోవడం మూలం గా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్టు గు ర్తించామని, గిరిజన రైతుల ఇబ్బం దులను పరిష్కరించేందుకు, వివిధ పంటల సాగుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడం, సోలార్ విద్యుత్ ద్వారా గిరిజన రైతులు పంపుసెట్ల వినియోగం వంటి కార్యక్రమాల పై చర్చించేందుకు కొద్దిరోజుల్లోనే అ టవీ, గిరిజన, ఉద్యాన, వ్యవసా య, ఇంధన శాఖల అధికారులతో ఒక సమావేశం నిర్వహిస్తామని డి ప్యూటీ సీఎం తెలిపారు.
CAMPA (compe nsatory affore stat ion fund management and planning authority) పనులు పెద్ద సంఖ్యలో చేపట్టి పచ్చదనాన్ని కాపాడాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకొని చెక్ డ్యాములు, ఇతర పనులు చేపట్టాలని సూచించారు. హైద రాబాద్ మహానగరం తో పాటు పరిసరాల్లో 59 అర్బన్ పార్కులు ఉన్నాయి, ఒత్తిడిలో జీవించే నగర ప్రజలు ఉపశమనం పొందేందుకు వీటిని అభివృద్ధి చేయాలని అర్బన్ పార్క్ ల ద్వారా ఆదాయాన్ని పెం చుకునే మార్గాలను అన్వేషించాల ని మంత్రులు సంబంధిత అధి కారు లను ఆదేశించారు. వన మహోత్స వం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ని ర్వహించాలి, విద్యార్థులకు భాగ స్వామ్యం కల్పించాలని సూచించా రు. చిన్న చిన్న మొక్కలు కాకుండా రెండున్నర అడుగుల ఎత్తుకు తగ్గ కుండా ఉన్న మొక్కలను నాటడం ద్వారా ఎక్కువ సంఖ్యలో బతికే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అటవీశాఖ ప్రి న్సి పల్ సెక్రెటరీ అహ్మద్ నదీం, దేవదా య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రమా అయ్యర్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు.