Deputy CM Pawan Kalyan: ప్రజా దీవెన, అమరావతి: సమా జంలో ఇతరులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో కించపరి చే విధంగా, అసభ్యకరంగా పోస్టు లు పెడుతున్న వారిపై ఏదోరకంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ వారిలో మార్పు కనబడడం లేదు. ఓ వైపు కేసులు నమోదవుతున్నప్పటికీ కొం దరు మాత్రం తమ బుద్ధిని కుక్కబు ద్దిలా ప్రదర్శిస్తున్నారు. తమకు న చ్చని, తమకు నచ్చిన వారికి వ్యక్తి గత,రాజకీయ శత్రువులుగా భా వించి అనుచిత పోస్టులు పెడుతూ నే ఉన్నారు. తాజాగా ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కల్యాణ్ పై హర్షవర్ధ న్ రెడ్డి అనే వ్యక్తి తన ఎక్స్ వేది కగా పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోం ది.
కుంభమేళాలో తన భార్య అ నా, కుమారుడు అకీరా నందన్, ద ర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ సభ్యుడు ఆనందసాయిలతో కలిసి పవన్ కల్యాణ్ పుణ్యస్నానాలు ఆ చరించిన సంగతి తెలిసిందే. వారు పుణ్యస్నానాలు చేస్తున్న ఫొటోను మరో సినీనటుడు సంపూర్ణేశ్ బా బుతో పోలుస్తూ హర్షవర్ధన్ రెడ్డి ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై జనసైనికులు తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత రిషికేశ్ కావలి టూ టౌన్ పోలీ స్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రిషికేశ్ ఫిర్యాదు మేరకు కావలి పోలీసులు కేసు నమోదు చేశారు.