— దేవరకొండ శాసన సభ్యులు బాలునాయక్
Devarakonda MLA Balunayak : ప్రజా దీవెన, డిండి: భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలం గాణ ప్రభుత్వం పేదలకు ఉచితం గా సన్నబియ్యాన్ని ఇస్తున్నదని దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ అన్నారు. గురువారం అ యన నల్గొండ జిల్లా, దేవరకొండ ని యోజకవర్గం పరిధిలోని గుండ్లపల్లి మండలకేంద్రం డిండి లో సన్న బి య్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రా రంభించారు.
సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక కార్యక్రమని ఆయన అన్నారు. ప్ర స్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం పథ కంలో అనేక లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా ఈ బియ్యం 90 శాతం రీసైక్లింగ్ అవుతున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రం లో లేనివిధంగా సన్నబియాన్ని రేష న్ షాపుల ద్వారా ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరు గుతున్నదని, అందువలన రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండిం చాలని ఆయన కోరారు. ఏదుల రిజర్వాయర్ నుండి చేపట్టిన దింది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంత మంతా సస్యశ్యామలమ వుతుంద ని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ ప్రభుత్వం సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపా యల బోనస్ ఇస్తున్నదని రైతులు పండించిన సన్న వడ్లను ప్రాసెసింగ్ చేసి సన్నబియ్యాన్ని చౌక ధర దు కాణాలు, రేషన్ షాపులు, హాస్టళ్లు, పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా ఇవ్వలేదని ,రైతులు సన్నధాన్యాన్ని పండిస్తే తిరిగి పేదవారికి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రbభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ బీసీలకు 4 లక్షల రూ పాయల వరకు ఆర్థిక సాయం అం దిస్తున్నదని, నిరుద్యోగ యువతీ యువకులందరూ స్వ యం ఉపాధి పొందేందుకు ఈ పథకం కింద దర ఖాస్తు చేసుకోవా లని ,ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చే సుకునేందుకు చివరి తేదీగా నిర్ణ యించడం జరి గిందని తెలిపారు. ధాన్యం కొనుగో లు కేం ద్రాల ద్వారా సన్నధాన్యం కొనుగో లు చేయడం జరుగుతుం దని, అం దువల్ల రైతులు సన్నధా న్యాన్ని పం డించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభు త్వం సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహిస్తు న్నదని కలెక్టర్ తెలిపారు. దేవరకొం డ ఆర్ డిఓ రమణారెడ్డి, దేవరకొం డ ఏఎ స్పీ మౌనిక, తదితరులు మాట్లాడారు.