Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

UPS Unified Pension Scheme: గో బ్యాక్ యుపిఎస్, నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్

–సెప్టెంబర్ 1 న సామూహిక సెల వు, లక్ష కలాలతో కవాతు
–ఏప్రిల్ 1 న బ్లాక్ డే, మే 1 న చలో ఢిల్లీ కార్యక్రమాలు

UPS Unified Pension Scheme: ప్రజా దీవెన హైదరాబాద్: యుపి ఎ స్ యూనిఫై డ్ పెన్షన్ స్కీం రద్దు ను కోరుతూ ఆదివారం హైదరాబా ద్ లోని ధర్నాచౌక్ లో తెలంగాణ రాష్ట్ర కం ట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లా యి స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అధ్యక్షతన యుపిఎస్ వద్దని యుద్ధభేరి ధర్నా కార్యక్రమం ముక్తకంఠ నినాదాలతో దద్దరిల్లిoది. ఈ ధర్నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లతో పాటు భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యా యులు హాజరయ్యారు. ఇటీవల జనవరి 24న కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకా రం యుపిఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీం అనేది ఏప్రిల్ 1 2025 నుండి అమలు చేయాలని గెజిట్ లో పే ర్కొన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకి స్తూ ధర్నా ను నిర్వహించమన్నా రు.

ధర్నా లో రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ మాట్లా డుతూ ఈ యుపిఎస్ విధానం అ నేది కార్పొరేట్లకు ధన ప్రవాహం కొనసాగించుటకు కోసమే వచ్చిం దన్నారు కేంద్రం ఆర్థిక శాఖ ఈ గెజిటెడ్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతే వసూలు చేసిన 10.5 లక్షల కోట్ల రూపాయల్ని అప్పనం గా కార్పోరేట్ చేతుల్లోనికి వెళ్తున్నా యని తెలిపారు. గత పది సంవత్స రాలుగా సిపిఎస్ వద్దని ఓ పి ఎస్ మాత్రమే సామాజిక భద్రతను చే కూర్చుండని పోరాటం చేస్తున్నా మని, ఇప్పుడు ఈ యుపిఎస్ విధానం తెచ్చి ప్రభు రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులని గందరగోళానికి గురి చేస్తుందన్నారు.ఇది ఏ ఉద్యో గ ఉపాధ్యాయ వర్గానికి ఆమోద యోగ్యంగా లేదన్నారు.

అసలు ఈ యుపిఎస్ లో 56 జే రూల్ ప్రకారం ఉద్యోగి కంట్రిబ్యూషన్ 10 శాతం మరి యు ప్రభుత్వ కాంట్రిబ్యూ షన్ 10శాతం ఇలా సర్వీస్ మొత్తం జమ అయిన పెన్షన్ నిధిని ఉద్యోగి ప్రాన్ అకౌంటు ద్వారా ఎన్ పి ఎస్ ట్రస్ట్ కు బదిలీ చేశాకనే ఉద్యోగికు సర్వీస్ పెన్షన్ నిర్ణయం జరుగు తుందన్నారు. అదే ఉద్యోగితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగుల కోసం పెన్షన్ను కొనుక్కో వాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గత పదిహేళ్లుగా సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ ఇవ్వాలని పోరాటం చేస్తే గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామన్నారు. ఇంకా పాత పెన్షన్ లో ఉండే డి ఏ ఆధారి త సర్వీస్ పెన్షన్ ,కమ్యూటేషన్ సౌకర్యాలను సాధించుకోవాలన్న తరుణంలో ఈ యుపిఎస్ విధానం వచ్చిందన్నారు.

జనవరి నెలలో సిపిఎస్ విధానంలో రిటైర్ అయిన హైకోర్టు జడ్జి విశ్రాంతిని న్యాయ మూర్తులకు కేవలం 6 నుండి 15వేల రూపాయల మధ్య పెన్షన్ అందుతుందని తెలిసి సుప్రీంకోర్టు యే దిగ్భ్రాంతి పోయిందన్నారు. మన రాష్ట్రంలో 2003 DSC ఉపా ధ్యాయులు రిటైర్ అవుతున్నారని వారికి 2000 నుండి 5000 లోపే పెన్షన్ వస్తుందని,ఈ సొమ్ముతో కుటుంబాన్ని ఎలా గడిపేది గౌరవ ప్రద జీవనం ఎలా అని ప్రశ్నిం చారు. సామాజిక భద్రత కల్పిం చాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ల కడుపు నింపే విధంగా తయార య్యాయి అన్నారు.

సిపిఎస్ రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం లేదు.. …గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గ డ్, ప్రస్తుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రా లు ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేస్తున్నాయని గుర్తు చేశా రు. ప్రతినెల రాష్ట్రం నుంచి సిపిఎ స్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ 450 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ కు ఎన్.పీ.ఎస్ ట్రస్ట్ ద్వారా తరలి పోతాయన్నారు ఇటీవల ప్రభుత్వ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి నియమిం చిన 51 వేల ఉద్యోగస్తుల సిపిఎస్ సొమ్ముతో కలిపి దాదాపు 600 కో ట్లు షేర్ మార్కెట్ కు తరలి పోతు న్నాయన్నారు.

మన రాష్ట్రం సీపీఎ స్ నుండి పాత పెన్షన్ లోకి వెళ్లినట్ల యితే ఇప్పటివరకు గత ఇరవై ఏళ్లుగా ఉద్యోగ,ప్రభుత్వ కాంట్రి బ్యూషన్ సొమ్ము ఉన్న పెన్షన్ నిధి 17 వేల కోట్ల రూపాయల ఇతర ప్రజా ప్రయోజన పథకాలకు ఉప యోగించుకోవచ్చునని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ సమయంలో పాత పెన్షన్ సౌకర్యా లు కల్పిస్తే చాలన్నారు. అంతే కా కుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో నికి రావడానికి ఓట్ ఫర్ ఓపిఎస్ ద్వారా దాదాపు 14 శాసనసభల్లో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల ప్రభావితం చూపా రన్నారు.

మే 1 న చలో ఢిల్లీ … యుపిఎ స్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1 నాడు బ్లాక్ డే గా పరిగ ణించి దేశంలోని ప్రతి జిల్లాలో ప్రధా నమంత్రికి లేఖ రాస్తూ కలెక్టర్లకు వినతి ఇవ్వడం, అదేవిధంగా మే 1న చలో ఢిల్లీలో నిర్వహిస్తున్నా మని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ తెలిపారు. సెప్టెంబర్ 1న హైద రాబాద్ లో ఉద్యోగ ఉపాధ్యాయు లు సామూహిక సెలవు పెట్టి లక్ష కలాలతో కవాతు నిర్వహిస్తామ న్నారు.సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ పెన్షన్ చెల్లించే బా ధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పు కొని ప్రజల సొమ్మును పెన్షన్ ఫండ్ కు తరలించి షేర్ మార్కెట్లో పెట్టు బడులను పెంచడం ఈ సిపిఎస్ , యూపిఎస్ కి ముఖ్య లక్ష్యమని, పదవి విరమణ తరువాత జీవితం అస్థిరపడుతాయని, బి.పి.ఎల్ కు టుంబాలుగా మారుతాయన్నారు.

కంట్రిబ్యూషన్ లేని పెన్షన్ మనకు ఒక హక్కుగా అని, 2004లో సి. పిఎస్ విధానం వచ్చినప్పుడు ఎ వ్వరు అడ్డుకోలేదని అదేవిధంగా 2014లో రాష్ట్ర ఏర్పడినప్పుడు పెన్షన్ విధానాల మార్పు అవకాశం ఉన్నప్పుడు వ్యతిరేకరించినందున సిపిఎస్ ను మళ్ళీ అమలు చేశా రని, ఇక ఇప్పుడు ఏప్రిల్ 1 2025 నాడు యుపిఎస్ అమలు కోసం సీపీఎస్ నుండి ఏక్సిట్ అవకాశం వచ్చిందని , ఈ సమయంలో రా ష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా సిపి ఎస్ నుండి పాత పెన్షన్ విధానాల్లో నికి మారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు ల నిధిని రాష్ట్రానికి తీసుకురావా లని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరాకుల శ్రీనివాస్, సలహాదారు ఇన్నా రెడ్డి , పోల శ్రీనివాస్,మ్యాన పవన్, నరేం దర్ రావు, శ్యామ్ సుందర్, శ్రవణ్, మల్లికార్జున్, దేవయ్య, గడ్డం వెంక టేష్, ఆవునూరి రవి, సోమనాథ్, శ్రీకాంత్ నాయక్,షఫీ ,లచ్చిరాం, జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొ న్నారు.