Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Agriculture Officer Shravan: జిల్లాలో పంటలకు సరిపడా ఎరువులు

— డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

— రైతులు కొనుగోలు సమయంలో రసీదు తప్పక పొందాలి

–జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్

District Agriculture Officer Shravan: ప్రజాదీవెన నల్గొండ: జిల్లాలో ప్రస్తుతం వానాకాల పంట మొదలైంది.రైతులు వివిద పంటలను సాగు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ప్రస్తుత వానాకాకాలం 2025 కు కావలసిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్ తెలిపారు. శనివారం జిల్లాలొని వివిద ఎరువుల కంపెనీ సరఫరాదారులతో, మర్క్ఫెడ్, హోలెసలే ఎరువుల సరఫరా దారులతో సమీక్షా సమావేశని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ నేటికీ అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

అన్ని ఎరువులు జిల్లాలో 64,242 మెట్రిక్ టన్నుల ఉండగా అందులో యూరియా 29,067 మెట్రిక్ టన్నులు, డిఏపి 3,425 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్ష్సులు 28,102 మెట్రిక్ టన్నులు ఇతర ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ ఎరువులు జూలై నెల మొత్తం రైతులకు సరిపోతాయని, ఈ ఎరువులను యం ఆర్ పి దరలకు ఎలాంటి ఇతర ఎరువులను లింకు చేయకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. ఎవరైనా ఎరువుల సరఫరాలో అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ కంపెనీ సరఫరాదారులు, మర్క్ఫెడ్ వారు, హోలెసలే, రిటైల్ డీలర్లు ఎరువుల అమ్మకాలలో తప్పక ఈపాస్ యంత్రములలో నమోదు చేయాలని ఆదేశించారు.

ప్రతి నెల జిల్లాకు కేటాయించబడిన ఎరువులపై సమీక్షించి రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సరఫరా చేయాలని ఆదేశించారు. కావున జిల్లాలోని రైతులందరూ వ్యవసాయ అధికారులు పంటలకు సిఫార్సు చేసిన మోతాదులలో ఎరువులను ఉపయోగించి నేల భూసారాన్ని కాపాడుతూ ఎరువులను యం ఆర్ పి దరలకే కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో తప్పక రశీదు పొందాలని కోరారు.