— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న పౌష్టికాహార పంపిణీ, పాఠశాల పూర్వ విద్య కార్యక్ర మాల ద్వారా లబ్ధి పొందేందుకు 5 సంవత్స రాల లోపు పిల్లలందరినీ దగ్గర్లోని అంగ న్వాడి కేంద్రాలలో నమోదు చేయిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కో రారు. రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మే రకు ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహిస్తున్న “అ మ్మ మాట అంగ న్వాడి బాట”
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడి యా ప్రతినిధులతో మాట్లాడుతూ గర్భిణీస్త్రీలు, బాలింతలు, 6 నెలల నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దగ్గర్లో ఉన్న అంగన్వాడీ కేం ద్రాల్లో నమోదు కావాలని,ప్రభుత్వం వీరికోసం ప్రతిష్టాత్మకమైన పథకాల ను అమలు చేస్తున్నదని,ప్రత్యేకించి చిన్న పిల్లలు, బాలింతలకు పౌష్టికా హార పంపిణీ, చిన్నపిల్లలకు పాఠ శాల పూర్వ విద్యలో భాగంగా నే ర్చుకోవాల్సిన అంశాలు తరగతి గదిలో నేరుగా విద్యనందించే విధా నం కాకుండా, తొలిమెట్టు ఎలా ఉం డాలన్న దానిపై ఏం బోధించాలనే దానిపై అంగన్వాడీ కేంద్రాల ద్వారా నేర్పించడం జరుగుతుందన్నారు.
ఇందుకుగాను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కార్యక్రమాలను రూపొందిచాయని, వీటిని అంగ న్వాడి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అందువల్ల తప్పనిసరిగా 5 సం వత్సరాలలో పు పిల్లలను స్థాని కంగా ఉన్న అం గన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయా లని ఆమె పునరు ద్ఘాటించారు. జి ల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సిడి పివో హరిత,స్థానిక ప్రజా ప్రతి నిధు లు సుభాష్, తదితరులు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
