–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన భవిత కేంద్రం అందర్నీ ఆకట్టుకునేలా ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భవిత కేంద్రం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కాగా నల్గొండ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన భవిత కేంద్రం ఆధునికీకరణ పనులు దాదాపు 90 శాతం పూర్తి కాగా, తక్కిన 10 శాతం పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ చెప్పారు. శనివారం ఆమె ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఉన్న భవిత కేంద్రం ఆధునికీకరణ పనులను పరిశీలించారు. భవిత కేంద్రం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న విద్యార్థుల వివరాలను ఎంఈఓ అరుంధతి ద్వారా అడిగి తెలుసుకోగా, ప్రస్తుతం 16 మంది ఉన్నారని, ఉపనియామకంపై నియమించబడిన ఉపాధ్యాయులు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సర్వే నిర్వహిస్తున్నారని, కేంద్రం ప్రారంభం నాటికి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎంఈఓ జిల్లా కలెక్టర్ కు తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ స్త్రీ శక్తి భవన్ ను, ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ రోహిత్, ఏపీఎం వినోద తదితరులు ఉన్నారు.