Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : బి ఏ ఎస్ పెండింగ్ ఫీజులను వెంటనే రిలీజ్ చేయాలి

–కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన

–కలెక్టర్ కు వినతి

District Collector Ila tripathi: ప్రజాదీవెన నల్గొండ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు సంబంధించిన గత మూడు సంవత్సరాల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఎప్సి, ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య ను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కానీ గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలకు నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. దీంతో పాఠశాల యాజమాన్యం వారు తమ పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పుస్తకాలు, ఇతర వస్తువులను బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే రేలీట్ చేయాలని, విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.