— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమై నదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.సోమవారం ఉదయాది త్య భవన్ లో నిర్వహించిన లైసె న్స్డ్ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీల న ,సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.
ఈ నెల 26 నుండి సుమారు 50 పనిదినాలు లైసెన్స్డ సర్వేయర్లకు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చే సుకోవాలని కలెక్టర్ కోరారు. వివిధ సందర్భాలలో నిర్వహించే సర్వే స మయంలో సర్వేయర్ల పాత్ర మరువ లేనిదని అన్నారు. భూములకు సం బంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల సంద ర్భంగా భూసేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే ,ఎఫ్ లైన్ సర్వే వంటి సర్వేల సమయంలో సర్వే యర్లు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు.
ప్రత్యేకించి రెవెన్యూ కు సంబంధిo చి గ్రామాలు,మండలాల అంతర్గ త సరిహద్దుల నిర్ణయంలో, అలాగే అంతర్గత సరిహద్దుల వివాదాల ప రిష్కారానికి నిర్వహించే సర్వే విష యంలో సర్వేయర్లది కీలక పాత్ర అ ని అన్నారు. అందువలన సర్వేయ ర్లు శిక్షణకు హాజరై జాగ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చే సుకొని సద్వినియోగం చేసుకోవా లని కోరారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ 150 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల కు సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు. కాగా జి ల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ల కై మీ- సేవ ద్వారా 819 మంది దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతన సోమ వారం 409 మంది ధ్రువపత్రాలు పరిశీలించడం జరిగింది. 2 వ విడ త ఆగస్టులో మరో 410 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. లై సెన్స్డ్ సర్వేయ ర్లకు మహాత్మా గాం ధీ యూనివర్సిటీ లో శిక్షణ ఇవ్వను న్నారు.
ఈ కార్యక్రమానికి సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇంచార్జ్ ఏ డి సుజాత, డి ప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ రమణ య్య,సూపరింటిండెంట్ రాధాకృష్ణ, తదితరులు హాజర య్యారు.