District collector Ila Tripathi: ప్రజా దీవెన, చండూరు: గత పది సంవత్సరాల నుండి ఇల్లు లేక గుడిసెలో నివసిస్తున్నామని, ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ ర్యం లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ పథకం కింద తమకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం సం తో షంగా ఉందని చండూరు మండలం ఉడతలపల్లికి చెందిన కుక్కల బొ జ్జమ్మ ,ఓంకార్ లు జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి కళ్ళ ముందే సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గురు వారం చండూరు మండలం, ఉడత ల పల్లి గ్రామాన్ని సందర్శించి నిర్మా ణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆ కస్మికంగా తనిఖీ చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కుక్కల బొజ్జ మ్మ ,ఓంకార్లతో ముఖాముఖి మా ట్లాడారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం పట్ల ఎలా ఉందని బేస్ మెంట్ బిల్లు లు వచ్చాయా అని ప్రశ్నించగా త మకు ఇందిరమ్మ ఇల్లు రావడం సం తోషమని, ఇప్పటివరకు ఎలాంటి ఇల్లు లేకుండా ఉన్నామని, ప్రభు త్వం మాకు ఇల్లు మంజూరు చేయ డం చాలా సంతోషంగా ఉందని, అంతేకాక బేస్మెంట్ బిల్లు కూడా వ చ్చిందని తెలిపారు. ఇందుకు వారు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ఉడతలపల్లి గ్రామానికి 65 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 11 బేస్మెంట్లు పూర్త య్యాయి. అంతేకాక ఇద్దరికీ బేస్మెం ట్లకు సంబంధించిన బిల్లుల చెల్లిం పు కూడా పూర్తి చేసినట్లు అధికారు లు తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కు మార్, ఇన్చార్జ్ ఆర్డిఓ రమణారె డ్డి, తహసిల్దార్ కిరణ్మయి తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Next Post