–కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565 కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్ లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్ పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ రోడ్డుకు సంబంధించి అవార్డు పాస్ చేసేందుకు గాను ముందుగా పత్రికలో నోటిఫికేషన్ విడుదల చేయటం, అలాగే మార్కెట్ ధర నిర్ధారణ, వివరాలన్నింటిని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం పూర్తి చేయాలని సూచించారు. బైపాస్ సందర్భంగా స్ట్రక్చర్లు, ఇతర నిర్మాణాలపై ఆమె సమీక్షించారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జాతీయ రహదారుల సంస్థ విశ్రాంత భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్య నారాయణ, జాతీయ రహదారుల సంస్థ ఎస్ఈ ధర్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్రప్రసాద్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.