-విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కేతపల్లి పంచాయతీ కార్యదర్శి
— సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి
–ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్య స్థానాన్ని వదిలి వెళ్ళకూడదని ఆదేశం
–కార్యదర్శి పదవికి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంపిడిఓ కు సూచన
District Collector Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: సరైన పత్రాలు లేకుండానే ఇంటి ధ్రువప త్రాన్ని జారీచేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను కేతేపల్లి మండలం, కేతేపల్లి గ్రామ పంచాయతీ గ్రేడ్-3 కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
కేతేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు కేతేపల్లి లోని ఇంటి నెంబర్ 2- 97/1 కు సరైన పత్రాలు లేకుండానే ఇంటి ధ్రువ పత్రం జారీ చేశారని, అంతేకాకుండా 2015- 16 గ్రామపంచాయతీ రివిజన్ రిజిస్టరు లో నమోదు చేయకుండానే
ఇంటి ధ్రువ పత్రాన్ని మంజూరు చేశారని ఆ ఉత్తరులో పేర్కొన్నారు. దీనిని బట్టి విధుల పట్ల పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం స్పష్టంగా తెలియజేస్తున్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అతనిని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
సస్పెన్షన్ సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్య స్థానాన్ని వదిలి వెళ్ళకూడదని వెంకటేశ్వర్లును ఆదేశించారు.
కేతేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవికి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేతేపల్లి ఎంపిడిఓ ను కలెక్టర్ ఆదేశించారు.