Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : రైతులకు న్యాయం జరిగేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలి…

** కార్యాలయంలో అటెండర్ నుండి పై అధికారులు వరకు అవినీతికి పాల్పడిన అధికారులపై సస్పెన్షన్
వేటు తప్పదు..
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Tripathi : ప్రజా దీవెన/ కనగల్: మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ధరణిలోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన భూ భారతి చట్టాన్ని ఎలాంటి అవినీతికి పాల్పడకుండా తు.చ తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందువల్ల రెవెన్యూ అధికారులు నిజాయితీగా పనిచేయాలన్నారు.భూములు సర్వే చేసిన తర్వాత మ్యుటేషన్ చేసినట్లయితే ఎలాంటి వివాదాలకు అవకాశం ఉండదన్నారు. ఒక ఎకరా ప్రభుత్వ భూమి కూడా మాయం కాకుండా కాపాడుతామన్నారు. మొఖా మీద ఉన్న రైతులకు హక్కు కల్పించడమే భూ భారతి ఉద్దేశమని, అందువలన రైతులు వారి భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కలిగి ఉండడమే కాక మోకపై ఉండాలని కోరారు.

ధరణి పోర్టల్ లో అనుభవదారు కాలం లేదని, భూ భారతిలో 4 వ సెక్షన్ లో అనుభవదారు కాలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోకాపై ఒకరు, రికార్డులలో ఒకరు ఉంటే నిజమైన రైతులు దరఖాస్తు చేసినట్లయితే వాటిని పరిశీలించి విచారణ చేసి సారి చేస్తామన్నారు.గతంలో. ధరణి లో ఏదైనా తప్పులు జరిగితే సవరించేందుకు అవకాశం లేకుండేదని, భూ భారతిలో ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్ స్థాయిలో సవరించే అధికారం ఉందన్నారు. భూసేకరణ ద్వారా సేకరించిన భూములలో ఎంజాయ్ మెంట్ సర్వేను తప్పనిసరిగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సమాధానాలు చెప్పారు.
నల్గొండ ఆర్ డి ఓ అశోక్ రెడ్డి భూ భారతి చట్టం ప్రాముఖ్యతను తెలియజేశారు.
మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు మాట్లాడారు.
తహసిల్దార్ పద్మ సమావేశానికి అధ్యక్షత వహించగా, మండల స్థాయి అధికారులు, రైతులు హాజరయ్యారు