Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Medical and Health Officer Srinivas: ప్రతిగర్భవతికి సరైన వైద్య సూచన లు చేయాలి

— జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాస్

District Medical and Health Officer Srinivas: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, ఎమ్. ఎల్. హెచ్. పి. లకు, సూపర్వైజర్ల కు సమీక్షా సమావేశం జరిగినది.ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రజలకు నీటి ద్వారా మరియు దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలియజే స్తూ వాటి నివారణ కోసం చేయవల సిన కార్యక్రమాల గురించి వివరించ డం జరిగినది. ముఖ్యంగా “స్టాప్ డయేరియా క్యాంపెయిన్” కార్యక్ర మం గురించి వివరించడం జరిగిన ది. ఇందులో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మరియు జింక్ మాత్రలు అవసరం ఉన్నవాళ్లు సరిగ్గా వాడేటట్లు అవగాహన పెంచాలని సూచిం చారు. అదేవిధంగా మాతా శిశు సంరక్షణ సేవలలో భాగంగా ప్రతి గర్భవతిని మూడు నెలల లోపే గుర్తించి వారికి సరియైన సేవలు సూచనలు చేయాలని సూచిం చారు. సరిగ్గా పని చేయని వారిని తీవ్రంగా మందలించారు.

ఈ నెలా ఖరులోపు కచ్చితంగా నూటికి నూ రు శాతం సేవలు అందించాలని జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. అదేవిధంగా కనగల్, పెద్దవోర పీ.ఎచ్.సి. లలో మంచిగా సేవలందించినందుకు వైద్యాధి కారులను మెచ్చుకున్నారు. ఈనెల 21 నాడు జరగబోయే అంతర్జాతీ య యోగా దినోత్సవం గురించి తెలుపుతూ ప్రతి సబ్ సెంటర్లో ఆరోగ్య కేంద్రాలలో ఉదయం ఏడు న్నర వరకు యోగ డే నిర్వ హించా లని సూచించారు. ఇందులో ప్రజల ను ప్రజాప్రతినిధులను భాగస్వా మ్యం వహించేటట్టు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రా మ్ అధికారులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, డాక్టర్ రవి గారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, డాక్టర్ అరుంధతి గారు, డాక్టర్ కృష్ణ కుమారి గారు మరియు డాక్టర్ తిరుపతి రావు డెమో గారు విష్ణు డిపిఓ గారు వైద్యాధికారులు సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు