— డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్
–సీజన్ వ్యాధులపై అవగాహన
DMHO Dr. Srinivas: ప్రజాదీవెన నల్గొండ: కీటక జనిత వ్యాధుల నివారణ కోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జూన్, జూలై నెలలను మలేరియా, డెంగ్యూ నివారణ మాసాలుగా నిర్వహించాలని, వర్షాకాలం మొదలైనందున డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా, బోదకాలు, మెదడు వాపు, వ్యాధులు వస్తాయని అందువల్ల దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ కే. రవి, డాక్టర్ కెవిఎస్ఎన్ కృష్ణకుమారి, డాక్టర్ అరుంధతి, డిపిఓ విష్ణు, జిల్లా మత్స్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమ శాఖ, ఐసిడిఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు, డిఆర్డిఏ, డిఇఓ మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.