— రూ.2125 కోట్ల పెట్టుబడులు, 5020 మందికి ఉపాధి
–యూఏఈ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ పెట్టుబడి
–రాష్ట్రానికి చెందిన అయిదు కంపె నీలతో అవగాహన ఒప్పందం
–రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి
Duddilla Sridhar Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో యూఏఈకు చెందిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సం యుక్తంగా రూ.2125 కోట్ల పెట్టుబ డులు పెట్టేందుకు ముందుకొచ్చిన ట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడిం చారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన అయిదు స్థానిక కంపెనీలతో ఈ రెండు సంస్థలు మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో అవగాహన ఒప్పందం చేసుకు న్నాయన్నారు. తద్వారా కొత్తగా మరో 5020 మంది తెలంగాణ యు వతకు ఉపాధి లభిస్తుందని వివరిం చారు.
‘రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొ చ్చి తెలంగాణ యువతకు ఉద్యోగా లు కల్పించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పం’ అని ఈ సందర్భంగా సచి వాలయంలో నిర్వహించిన పాత్రికే య సమావేశంలో పేర్కొన్నారు. ‘18 నెలల్లో 60వేలకు పైగా ప్రభు త్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడా దిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసు కొచ్చాం. ఫలితంగా ప్రైవేట్ రంగం లో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించా యి. ఈ ప్రయాణంలో ఈరోజు మ రో గొప్ప అడుగు ముందుకేశాం’ అ ని అన్నారు.
‘అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ధీటుగా దూసుకె ళ్తున్న తెలంగాణ పురోగతిలో భాగ స్వామయ్యేందుకు ముందుకొచ్చిన యూఏఈకి చెందిన ప్రముఖ కంపె నీలు శైవ గ్రూప్(Shaiva Group), టారనిస్ కేపిటల్(Taranis Capi tal) ను ప్రభుత్వం తరఫున సాద రంగా ఆహ్వానిస్తున్నామని చెప్పా రు. ‘శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంయుక్తంగా రివలేషన్స్ బయోటెక్ లో రూ.1360 కోట్లు, మనాకిన్ బయోలో రూ.340 కోట్లు, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజ ర్స్ లో రూ.80 కోట్లు, ఎగ్జిగెంట్ డ్రి ల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.90 కోట్లు, యంత్ర టెక్ కంట్రోల్స్ లో రూ.255 కోట్లు పెట్టుబడులు పె డుతున్నాయని చెప్పారు.
‘ఇది తొలి అడుగు మాత్రమే. రాబో యే మూడేళ్లలో బయోటెక్, ఏఐ, డే టా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్ టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగా ల్లో లో మరో రూ.24వేల కోట్లు పె ట్టుబడి పెట్టేందుకు శైవ గ్రూప్, టార నిస్ కేపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశా యoటూ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ రెండు కంపెనీలు రాబోయే మూడే ళ్లలో బయోటెక్ రంగంలో తినుబం డారాల్లో చక్కెర శాతాన్ని తగ్గించ డం, యాంటీ డయాబెటిక్, ఫుడ్ మేనేజ్ మెంట్ ఉత్పత్తులు, పబ్లిక్ సెక్టార్ లో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ‘తెలం గాణ రైజింగ్’లో భాగస్వామ్యమ య్యేందుకు ముందుకొచ్చిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారు.
‘కొందరు రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు… పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ మా ప్రభు త్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి మేం తీసుకొస్తున్న పెట్టుబుడులు, కల్పిస్తున్న ఉద్యో గాలు కనిపించడం లేదా..? ఒక్కసా రి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు. ‘ఇక్కడి యువత ప్రతి భే మాకున్న పెద్ద ఆస్తి. డిగ్రీ, ఇంజి నీరింగ్ పట్టా తీసుకుని బయటికొ చ్చే విద్యార్థుల్లో పరిశ్రమలకు అవస రమైన నైపుణ్యాలు ఉండటం లేద నే ఫిర్యాదు పారిశ్రామికవేత్తల నుం చి తరచూ వస్తోంది. ఈ అంతరా న్ని తగ్గించేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశాం.
మీ అందరి భాగస్వామ్యం తో కోర్సు లకు రూపకల్పన చేసి మీకు కావా ల్సిన మానవవనరు లను రెడీమేడ్ గా అందిస్తున్నాం. మీకు ఖర్చు, శ్రమ తగ్గిస్తున్నామని పారిశ్రామికవే త్తలకు వివ రించారు. ‘తెలంగాణ ఒక రాష్ట్రం కాదు… అవకాశాల గ ని. ప్రతిభకు కేరాఫ్ అడ్రస్. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు కేంద్రం. అంతర్జాతీ య భాగస్వామ్యాలకు గమ్యస్థా నం. మీ ఎదుగుదలే… మా రాష్ట్రా భివృద్ధి అని నమ్మే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుం ది. అందుకే తెలంగాణలో పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాయ్ డిన్ రోచ్, శైవ గ్రూప్ ఛైర్మన్, సీఈవో అమిత్ జగన్నాథ్ వర్మ, టారనిస్ కేపిటల్ సీఈవో నికోలస్ ఎస్.బింగ్ హామ్, రివలేషన్స్ బయో టెక్ ఎండీ రవిచంద్ర బీరం, మనాకి న్ బయో డైరెక్టర్ జశ్వంత్ ప్రణవ్ యతిరాజాం, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ సీఈవో సంకర్ష్ చందా, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పాండురంగా రావు తమ్మినేని, యం త్ర టెక్ కంట్రోల్స్ సీఈవో సమీర్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.