Free Education and Healthcare : ప్రజా దీవెన కట్టంగూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనవ సరమైన పథకాలలను రద్దు పరచం డి ఉచితంగా విద్య వైద్యం అందించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. గురువారం కట్టంగూరు మండల కేంద్రంలో పత్రికా విలేక రుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం జరిగింది . ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడు తూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాలు మారుతు న్నాయని పేదల్లో బతుకుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదని అన్నారు. సంక్షేమ పథకాలకు తీవ్రమైన నిధుల కొరత ఉన్నదని గత నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క సంక్షేమ పథకం ముందుకు సాగలేదని తెలిపారు. దళితులు గిరిజనులకు సంబంధించిన కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని తెలిపారు.
ఇండస్ట్రియల్ ద్వారా రావలసిన సబ్సిడీలు గత మూడు ఏళ్లుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడటానికి కెవిపిఎస్ సన్నద్ధమవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 22 ఆదివారం 23 సోమవారం రెండు రోజులు కుల వివక్ష, అంటరానితనం, ప్రభుత్వ విధానాలు, కులం మతం ప్రభావాలు ప్రతిఘటన పద్ధతులు, ప్రజల స్థితిగతులపై రాజకీయ శిక్షణా తరగతులు కట్టంగూరు మండల కేంద్రం వైవిఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 మండలాల నుండి 200 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఒంటెపాక కృష్ణ కట్టంగూరు మండల కార్యదర్శి చిలుముల రామస్వామి సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, రాజేష్,,సైదులు తదితరులు పాల్గొన్నారు.