Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Etala Rajender: ఈటల కీలక వ్యాఖ్య, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఏమి సంబంధం

Etala Rajender: ప్రజా దీవెన, హైదరాబాద్: కాలేశ్వ రం ప్రాజెక్ట్ 82 వేల కోట్ల అంచనా వేశారు, ఆ తరువాత ఎంతకు పెరి గింది నాకు మాత్రం తెల్వదు, కో సం వ్యాప్కోస్ సంస్థకి రూ. 595 కోట్లు విడుదల చేసినట్లు నాకు తె లియదని నాటి ఆర్ధిక మంత్రి, నేటి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేం దర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఏ ర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ను నియమించారు. ప్రాజెక్ట్ నిధుల సే కరణ, ఖర్చు పూర్తిగా ఇరిగేషన్ డి పార్ట్మెంట్ మాత్రమే చూసింది. ఎవ రికి నిధులు విడుదల చేశారు అ నే ది వారి పరిధిలో జరిగింది. బడ్జెట్ ఎలకిషన్ మాత్రమే ఫైనాన్స్ డిపా ర్ట్మెంట్ బాధ్యత అన్నారు. కాళేశ్వ రం కమీషన్ విచారణ అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే. కాళే శ్వరం కమీషన్ రిపోర్ట్ త్వరగా బ యటపెట్టాలి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ రాజ కీయపబ్బం గడపవద్దని కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నా.

ఏ పార్టీలో ఉన్నా నేను విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా కొనసాగుతున్న. రూ. 16,500 కోట్ల తో తుమ్మిడిహట్టి, చేవెళ్ల ప్రాజెక్ట్ ని ర్మాణం తలపెట్టారు.మళ్ళీ దానిని 38 వేల కోట్లకు పెంచారు.152 మీ టర్లు బ్యారేజి ప్రపోజల్స్ ఉంటే మ హారాష్ట్ర అభ్యంతరాలతో 148 మీ టర్లు తగ్గించింది. దీనివల్ల మనకు సరిపోయెన్ని నీళ్లు రావని, ప్రాజెక్ట్ నిర్మాణం కోసం హరీష్, తుమ్మల న న్ను కలిపి మంత్రివర్గ ఉపసంఘం వేసారు. టెక్నికల్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని చెప్పారు.

63 వేల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు, అది 82 వేల కోట్లకు వెళ్లిం ది తరువాత ఎంత పెరిగిందో నాకు అవగాహన లేదు. డిజైన్స్, క న్స్ట్రక్షన్ తో సంబంధం ఉందా అని అడిగారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు అని చెప్పాను.కార్పొరేషన్ రుణాల మీద అజ మాయిషీ ఉందా అని అడిగారు.లేదు అని చెప్పాను. ఇరిగేషన్ డి పార్ట్ లోనే అకౌంట్ ఆడిట్ డిపా ర్ట్మెంట్ లు పనులు, నాణ్యత చెల్లి పులు వారే చేసుకున్నారు తప్ప ఫై నాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. మా బ్రతుకు ట్రసపరెంట్ గా ఉన్నాయి. కణత మీద తుపాకీ పెట్టిన విలువలు పోగొట్టుకోము.
పిచ్చి కూతలు బంద్ పెట్టండి.

మీరెన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు.బట్టకాల్చి మీద వేయడం మా నే యండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తున్నా. బీజేపీ చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే పార్టీ. కమీ షన్ రిపోర్ట్ త్వరగా బయటపెట్టి నిజమైన దోషులను బయటపెట్టా లని డిమాండ్ చేస్తున్న. రాజకీయ పబ్బం గడిపితే ఊరుకోము. రిపోర్ట్ బయట పెట్టు.శిక్షించక పోతే నీకు శిక్ష తప్పదు. కేసీఆర్ వందల సార్లు కాళేశ్వరం సృష్టికర్త నేనే అని చెప్పు కున్నారు. నిర్ణయం తీసుకున్నారు. దానిని క్యాబినెట్ తో ఆమోదింపజే శారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబ ధం. ఘోష్ రిపోర్ట్ బయటపెట్టి దో షులను శిక్షించండoటూ డిమాండ్ చేశారు.