EVOIR: ప్రజా దీవెన, శ్రీహరికోట: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని (Sriharikota) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (space station) నుంచి ఇస్రో కొత్త రాకెట్ ఎస్ ఎస్ ఎల్ వి డి3 (SSLVD) నింగి లోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం తో పాటు ఈఓఎస్ 08 మిషన్గా కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను ప్రయోగించారు. సరిగ్గా శుక్రవారం ఉదయం 9:17 గంటల కు ప్రయోగించారు. ఈ ఉపగ్రహం విపత్తుల గురించి హెచ్చరికలు ఇస్తుంది.ఇది ఎస్ ఎస్ ఎల్ వి డి3 చివరి రాకెట్ కావడం విశేషం. పర్యావరణం, ప్రకృత్తి విపత్తులు, అగ్ని పర్వతాలపై (Environment, natural disasters, volcanoes)ఇది పర్యవేక్షిం చనుంది. ఈ ప్రయోగం మొత్తం 17 నిమిషాలపాటు సాగింది. ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈవోఎస్ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ (ఈవోఐఆర్) పేలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రా-రెడ్లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుంద ని ఇస్రో పేర్కొంది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఇస్రో రాకెట్ (ISRO rocket) ప్రయోగించింది. 2024లో బెంగళూరు ప్రధాన కార్యాలయమై న అంతరిక్ష సంస్థ జనవరి 1న PSLV-C58/XPoSat మిషన్ను, ఫిబ్రవరి 17న GSLV-F14/INS AT-3DS మిషన్ను విజయ వంతంగా ప్రయోగించింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.