Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Explosion: ఉత్తర్ ప్రదేశ్ లో బాణసంచా ఫ్యా క్టరీలో పేలుడు

–ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృత్యువాత

Explosion: ప్రజా దీవెన, ఉత్త‌ర ప్ర‌దేశ్ : ఉత్తర ప్రదేశ్‌ లో సోమవారం ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. అమ్రో హాలో ని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటన లో ఐదు గురు కార్మికులు ప్రాణాలు కోల్పో యారు. శిథిలాల కింద చిక్కుకుని పలు వు రు గాయపడ్డారు. అది అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీ గా తెలిసింది.ఈ ఘటనలో ఐదుగు రు మహిళా కార్మికులు ప్రాణాలు కో ల్పోగా 12 మంది గాయపడ్డారు. పే లుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉం డటంతో శిథిలాలు 300 మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి.

పే లుడు ధాటికి సమీపంలోని భవనా లు కూడా దెబ్బతిన్నాయి. సమాచా రం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం సమీ పంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు స్తోంది. ఈ ఘటనపై పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు.