.*9000 కోట్ల నిధులు 70 లక్షల మంది రైతుల ఖాతాలో
Farmer Assurance Celebrations: ప్రజా దీవేన, కోదాడ ‘ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో రైతు వేదిక లో రైతు భరోసా సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, కాపుగల్లు పిఎసియస్ చైర్మన్ నంబూరి సూర్యం, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొండపు సతీష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసాను గత తొమ్మిది రోజులు రైతులకు 9 వేల కోట్ల రూపాయల 70 లక్షల మంది రైతులకు రైతు భరోసాను క్రింద వారి ఖాతాలలో డబ్బులు జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ క్రీంద రెండు కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సన్న బియ్యం పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచి పేద ప్రజలు కడుపునిండా అన్నం పెట్టేందుకు ఈ పథకాన్ని అమలు చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వాన్ని తెలిపారు. కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సహకారంతో వేలకోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి కోదాడ మండలం తో నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. అనంతరం టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని రైతులు వీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్లకుంటమాజీ సర్పంచ్ సాదినేని లీల అప్పారావు, గడపవరం గ్రామ శాఖ అధ్యక్షులు జాబిశెట్టి నాగ ప్రసాద్, బండి చిన్న కోటయ్య మాజీ ఎంపీటీసీసింగారెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి, ఎర్రవరం గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్కే లతీఫ్, వేమూరి మధు ,రావుల వెంకటేశ్వర్లు, రామలక్ష్మి పురం పిఎసిఎస్ వైస్ చైర్మన్ కొప్పుల సుభాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ లిక్కీ గురవమ్మ వెంకటయ్య ,పి కొండల్ తదితరులు పాల్గొన్నారు.