Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

farming and self-respect : కష్టం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేదే వ్యవసాయం

–యువ రైతుల శిక్షణ కార్యక్రమం లో ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి

farming and self-respect : ప్రజా దీవెన, మునుగోడు: మన క ష్టం మనం చేసుకుంటూ ఆత్మగౌర వంతో జీవించేది వ్యవసాయమని, ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ రైతులు ఎక్కువ రాబడిని పొందా లని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకాం క్షించారు. వ్యవసాయానికి ప్రధాన వనరు నీరెనని, ఆ నీటిని తీసు కొచ్చే బాధ్యత నాది అని స్పష్టం చేశారు. మునుగోడు లోని రైతు వే దికలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువ రైతు లకు పంటల సా గు మెలకువల పై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ రైతుల శిక్షణ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా యజ్ఞం చేస్తున్నామని, ఒ కవైపు శివన్న గూడెం రిజర్వాయర్ కి నీటిని తీసుకురావడానికి ప్రయ త్నం చేస్తూనే మరోవైపు చిన్న నీటి వనరుల ద్వారా భూగర్భ జలాలు పెంచే విధంగా మొదటి దశగా 148 చెరువులను అభివృద్ధి చేసుకుంటు న్నామన్నారు. ఉద్యానవన శాఖ రైతులు కొన్ని సమస్యలను గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వా టిని దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆధు నిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడిని సాధిస్తున్న యువ రైతులను ఎమ్మెల్యే సన్మా నించారు.

ఈ సమావేశంలో ఆధునిక పద్ధతు లను అనుసరిస్తూ సాగు చేస్తూ ఎ క్కువ దిగుబడిని, అధిక రాబడి ని పొందుతున్న యువ రైతుల విజ య గాధలను ఇతర రైతులకు పరి చయం చేస్తూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆధునిక పద్ధతుల ద్వారా ఉద్యానవన శాఖ సలహా లు సూచనలతో వ్యవసాయం చేస్తే అధిక రాబడి పొందవచ్చని ఈ స మావేశం ద్వారా రైతులకు విన్నవిం చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన వ న శాఖ అధికారి అనంతరెడ్డి, ము నుగోడు నియోజకవర్గ ఉద్యాన వ న శాఖ అధికారి విద్యాసాగర్, ని యోజకవర్గంలోని యువ రైతులు అందరూ పాల్గొన్నారు.

అసైన్డ్ పట్టా భూమి ని ఇచ్చిన రైతుకు సన్మానం… మునుగోడు నియోజకవర్గానికి మంజూరైన ఇం టిగ్రేటెడ్ పాఠశాలను మునుగోడు లోనే నిర్మించాలనే ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంకల్పానికి ఒక్కొక్క అడుగుతోడవుతుంది. సర్వే నెంబర్ 78లో నిర్మించ తలపె ట్టిన ఈ పాఠశాలకు రైతులు స్వ చ్ఛందంగా తమ అసైన్డ్ పట్టా భూ ములను ఇవ్వడానికి ముందుకు వ స్తున్నారు. మునుగోడు పట్టణానికి చెందిన మేడి ముత్తయ్య తమకు న్న మూడు ఎకరాల భూమిని స్వ చ్ఛందంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ని ర్మాణానికి ఇవ్వడంతో మునుగోడు లోని క్యాంపు కార్యాలయానికి మే డి ముత్తయ్యను పిలిపించుకుని స న్మానించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు.