Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

FASTag Annual Pass: వాహనదారులకు తీపి కబురు

–అందుబాటులోకిరూ.3వేలు రీచా ర్జ్‌తో ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌

FASTag Annual Pass: ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దేశంలోని ఫాస్టాగ్ యూజర్ వాహనదారులకు కేంద్రం తీపి కబురు అందించింది. కేవలం రూ. 3వేలు రీచార్జ్‌తో ఫా స్టాగ్‌ వార్షిక పాస్‌ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ పాస్ తీసుకుంటే 200 ట్రిప్పుల వరకు ప్ర యాణించే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాదికి రూ. 3వేలు రీచార్జ్‌ చేసుకుని దేశం లో ఎక్కడైనా తిరిగే అవకాశం క ల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆగ ష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమ లులోకి తీసుకువస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు.

ఇక ఈ పాస్ దేశవ్యాప్తంగా ఏ ర హ దారిపైన ప్రయాణించినా చెల్లు బా టు అవుతుంది. దేశంలో జాతీయ రహదారులపై నిర్బంధ రహిత ప్ర యాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఫా స్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశ పెడుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటిం చారు. వాణిజ్యేతర, వ్యక్తిగత వా హనాలకు ఈ అవకాశం కల్పిస్తున్న ట్లు ఎక్స్‌ లో పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్యా గ్ అనేది ఒక చిన్న ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది రేడియో ఫ్రీక్వె న్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకే తికతను ఉపయోగించి వాహనాల టోల్ రుసుములను ఆటోమేటిక్‌గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. దీ నిని వాహనం విండ్‌స్క్రీన్‌పై అటాచ్ చేసుకుంటారు. టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సేపు ఆగకుండా టోల్ చె ల్లించడానికి అనుమతిస్తుంది. అ యితే, ఈ ఇయర్ పాస్‌తో టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గిపోతుంది. దీంతో ప్రయాణం మ రింత సులభతరం అవుతుంది. అం తేకాకుండా ఆర్థికంగా కూడా ప్ర యోజనకరంగా ఉంటుంది.