10th Grade Felicitation : ప్రజా దీవేన, కోదాడ : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఆదివారం పట్టణంలోని స్థానిక నయా నగర్ లోని బాప్టిస్ట్ చర్చి నందు కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు .
ఈ సందర్భంగా విద్యార్థులను శాలువలతో సన్మానించి బహుమతులు అందజేసారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతి పరీక్షలలో సాధించిన ఫలితాల కంటే మునుముందు మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులకు జన్మించిన స్థలానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్తీర్లైన విద్యార్థులు పాముల కీర్తన, లిన్సీ అలెన్, మోహన్ ప్రియా అభినాయక్, పింకీ, చరణ్.
కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ సభ్యురాలు శ్రీమతి జానకి ఏసయ్య బల్లి కొండ కోటయ్య, జగ్గు నాయక్, కానిస్టేబుల్ జాన్, రాంబాబు, మోసెస్, శారా, భాగ్యశీ తబిత, తదితరులు పాల్గొన్నారు.