Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Festival of Bread: నెల్లూరు రొట్టెల పండుగ షురూ

–బారాషహీద్‌ దర్గా వద్దకు భారీగా తరలివచ్చిన భక్తులు
–ఐదు రోజుల ఉత్స‌వానికి విస్త్రుత ఏర్పాట్లు చేసిన యంత్రాంగo

Festival of Bread:ప్రజా దీవెన, నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు (nellore)లో మొహ‌రం రోజైన (moharam festival) బుధవారం రొట్టెల పండుగ ప్రారం భమైంది. బారాషహీద్‌ దర్గా వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఊరిం చే వరాల రొట్టెను అందుకు నేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి అనంతరం కోర్కెల రొట్టెలు పం చుకున్నారు. బారాషహీద్‌లకు గలేఫ్‌లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో సందడి నెలకొంది. 5 వేల మంది సిబ్బంది రొట్టెల పండుగ విధుల్లో భాగస్వా ములై ఉన్నారు. భద్రతా విధుల్లో 2 వేల మంది పోలీసులను నియ మించారు. ఈ రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు జరగనుంది. కాగా భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసు కుంటారు.

గత ఏడాది తాము అను కున్న కోరికకు సంబంధించిన రొట్టె (rotti) ను పట్టుకుని అది నెరవేరితే తర్వా త మరుసటి ఏడాది వచ్చి ఆ రొట్టె ను వదలడం సంప్రదాయంగా వస్తోంది. ప్రధానంగా సంతాన రొట్టె ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె, వివాహ రొట్టె, విదేశీ రొట్టె, ఉద్యోగ రొట్టె ఇలా 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ ఇచ్చిపుచ్చుకుం టారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు భక్తుల రద్దీ అధి కం కావడంతో రొట్టెల పండుగను ఐదు రోజులపాటు నిర్వహిస్తు న్నారు. భక్తుల కోసం నెల్లూరు నగ రపాలక సంస్థ పోలీసు శాఖతో (police) పాటు ఇతర విభాగాల సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లను చేశారు. చెరువులో రొట్టెలు మార్చు కునేందుకు వీలుగా సూచిక బోర్డు లు భక్తులు ఉండేందుకు గుడా రాలు, స్నానపు గదులు మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మా ర్చుకునే గదులు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ నిర్వ హణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వేల మంది పోలీ సులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో భక్తుల కదిలికలను పర్యవేక్షించడం తో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూ సేందుకు ప్రత్యేక బృందాలను నియ మించారు.

వైద్య ఆరోగ్యశాఖ (Medical Health Department) ఆధ్వ ర్యంలో వైద్య శిబిరాలు(Medical camps).. నెల్లూరు చెరువులో బోటింగ్ కోసం పర్యాటక శాఖ ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ముందు జాగ్రత్తగా గజ ఈత గాళ్లను కూడా అధి కారులు సిద్ధంగా ఉంచారు. పం డుగలో భాగంగా మొదటి రోజున సందల్ మాలీ.. రెండో రోజున గంధ మహోత్సవం (Gandha Mahotsavam)నిర్వహిస్తారు. బారా షాహిద్ లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత ఆ గంధాన్ని భక్తు లకు పంచి పెడతారు. మూడవ రోజున రొట్టెల పండుగ.. నాలుగో రోజు తహలీల్ ఫాతెహ ఐదో రోజున ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా భక్తులు.. ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.