Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fire accident: డిల్లీలో విషాదం, అగ్నిప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Fire accident: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగ ళ వారం ఉదయం పెద్ద ఎత్తున మం టలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ద్వారకా సె క్టార్‌-13 లోని శపథ సొసైటీలో మం గళవారం ఉదయం ఈ ఘటన చో టు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని ఎనిమిది, తొమ్మిది అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డా యి.

దీంతో అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం నుంచి తప్పించుకునే క్ర మంలో భవనంపై నుంచి కిందకు దూకేశారు. అలా ప్రాణాలను కాపా డుకునే క్రమంలో తండ్రి, ఇద్దరు పిల్ల లు ప్రాణాలు కోల్పోయారు. ముం దుగా పదేళ్ల ఇద్దరు చిన్నారులు ప్ర మాదం నుంచి బయటపడేందుకు బాల్కనీ నుంచి కిందుకు దూకేశా రు. పిల్లల తండ్రి 35 ఏళ్ల యష్‌ యాదవ్‌ కూడా కిందకు దూకాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యా యి. అధికారులు వారిని సమీపం లోని ఆసుపత్రులకు తరలించగా అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయి నట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న అగ్నిమా పక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశా రు. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తు న్నారు. అగ్నిప్రమాదానికి గల కా రణాలు ఇంకా తెలియాల్సివుంది.