Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Firing: బలూచిస్థాన్ లో 30 మంది బలి

–బస్సులు, ట్రక్కులను అడ్డగించిన దుండగులు
–ప్రయాణీకులను కిందకి దించి కాల్చివేత
–ఇప్పటికే 33 మంది మృతి చావు బ‌తుకుల‌లో మ‌రో 21 మంది

ప్రజా దీవెన, ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ (Cousin is Pakistan)లో దారుణం చోటుచేసుకుంది. కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు (Firing) జరిపారు. బలూచిస్థాన్ లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్‌ మీడియా సంస్థ (Dawn Media Company) వెల్లడించింది . మ‌రో 21 మందికి బుల్లెట్ ల గాయాలయ్యా యి.ముసాఖెల్ జిల్లాలోని రరాషమ్‌లోని రహదారిపై (Road in Rarasham) ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు సాయుధులు దారిని అడ్డగించి, అటుగా వస్తోన్న బస్సులు, ట్రక్కుల్లో నుంచి ప్రయాణికుల్ని దింపి, వారి గుర్తింపు తనిఖీ చేశారు. తర్వాత వారిపై కాల్పులు జరపడంతో 23 మంది మృతి చెందారు. అంతేగాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. పాక్‌లోని (Pakistan) పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు మీడియా (media) పేర్కొంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.