Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TRS Harish Rao: మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్యలు, మేడిపండుచూడు మేలిమై ఉండు,పొట్టవిప్పి చూడు పురుగు లుoడు ‘రేవంత్’ నైజం

TRS Harish Rao: ప్రజా దీవన, హైదరాబాద్: మేడిపం డు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు…రేవంత్ రెడ్డి నోరు విప్పి తే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజు వయింది. ఆయన తీరు ఎట్లా ఉం దంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టుంది. నిండా మునిగినో నికి నాకేముంది అన్నట్టు అబద్ధా లు, అసత్యాల ప్రవాహంలో ముని గిపోయాడనీ మాజీమంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు . మండిపడ్డారు. మంగళవారం తె లంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. హరీష్ రావు ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే…రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. గోబ ల్స్ ని మించిపోయిండనీ విమర్శిం చారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టామ ని అంటాడు.రేవంత్ కత్తెర జేబులో పెట్టుకోని తిరుగుతున్నాడు. ఏడ రి బ్బన్ కనిపిస్తే అక్కడ కత్తిరిస్తున్నా డు. నిన్న రేవంత్ రెడ్డి ప్రారంభించి న ట్యాంకులు కేసీఆర్ హయాంలో ప్రారంభించినవి. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టామంటున్నారు.మీలాగా చిన్నగా ఆలోచించి పేర్లు మార్చాల ని అనుకోలేదు. దిక్కుమాలిన దివా లా కోరు రాజకీయాలకు కేసిఆర్ చేయరని స్పష్టం చేశారు.బిఆర్ఎస్ వచ్చిన తర్వాత నీటిపారుదుల శా ఖ మంత్రిగా నేనే ఉన్నాను. ఎల్లంప ల్లి ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి పూర్తి కా లేదు. ఆర్అండ్ఆర్ పూర్తి కాలేదు.. ల్యాండ్ అక్విజేషన్ పూర్తి కాలేదు. గ్రామ ప్రజలను ఖాళీ చేయించలే దనీ ఆరోపించారు. బిఆర్ఎస్ వచ్చి న తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును 2052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపాము.

మేము నీలాగా చిల్లర రాజకీయాల కు పోలేదు. నిన్న నువ్వు చేసిన శం కుస్థాపన కూడా మేము నిర్మించిన కాళేశ్వరం నీళ్లనే తీసుకెళ్తున్నావ్.
ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు. మి గిలిన 17 టీఎంసీల్లో సొంత ఆయ కట్టు 1,65,000 ఎకరాలు అంటే 12 టిఎంసిలు పోతాయి. ఎన్టిపిసి విద్యుత్ ఉత్పత్తికి ఆరున్నర టీఎం సీలు. మంచిర్యాల నియోజక వ ర్గం లో గూడెం లిఫ్ట్కు మూడు టీఎంసీ లు. లోకల్లో రామగుండం లిఫ్ట్ కు ఒక టిఎంసి వాడుకుంటాం. దానికి సామర్ధ్యం కంటే ఎక్కువ వాడుతు న్నామని తెలిపారు.

ఎల్లంపల్లి కెపాసిటీకి మించి మరో 20 టీఎంసీలు హైదరాబాద్ కి ఎలా తెస్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించా రు. ఎవరి చెవిలో పువ్వులు పెడు తున్నావ్ రేవంత్ రెడ్డి? ఎందుకు గోబల్స్ ప్రచారం చేస్తున్నావని నిల దీశారు.ముఖ్యమంత్రి కుర్చీకున్న గౌరవాన్ని తగ్గిస్తున్నావు. ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్ కు నీళ్లు గా లిలో వస్తున్నాయా ? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటర్లు ఆఫ్ చేస్తే మేడారం రిజర్వాయర్ లో పడతా యి.. లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్క డి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి.

మిడ్ మానేరు నుండి అనంతగిరి రిజర్వాయర్కు వస్తాయి. అక్కడ నుండి రంగనాయక సాగర్ కు వస్తా యి.. రంగనాయక సాగర్ నుండి మళ్లీ మోటార్ ఆన్ చేస్తే మల్లన్న సాగర్ కు వస్తాయి. ఎల్లంపల్లి నుం డి మిడ్ మానేరు దాకా కూడా కె నా ల్స్ గాని, గ్రావిటీ కెనాల్ కానీ, రిజ ర్వాయర్లు గాని, సబ్ స్టేషన్లు గాని, పంప్ హౌస్ లు గాని అన్ని నిర్మిం చింది బీఆర్ఎస్ అని అన్నారు.

*కాళేశ్వరంలో భాగంగానే నిర్మిం చాము..* …కేసిఆర్ ముందు చూ పుతో హైదరాబాద్ మంచి నీటి కో సం మల్లన్న సాగర్లో స్లూయిస్ కూడా నిర్మించి పెట్టిండు. గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టినవంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు..అవి కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు,కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వా యర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్ లు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెన్, 203 కిలోమీటర్ల టన్నెలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్.
ఈ 15 రిజర్వాయర్లలో ఒక రిజ ర్వాయర్ మల్లన్న సాగర్. ఇది కా ళేశ్వరంలో అంతర్భాగమనీ పేర్కొ న్నారు. కాళేశ్వరం కోసం ఖర్చు చేసి న 93 వేల కోట్లలో నిర్మించింది మల్ల న్న సాగర్.

కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకున్న గౌరవం తగ్గుతుందనీ అన్నారు.కేసీఆర్ ప్ర భుత్వం సాధించిన విజయాలను కూడా తన విజయంగా చెప్పు కుం టాడు.కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తే కేవలం కాగితం ఇచ్చి ఈ ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడనీ విమ ర్శించారు.ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌస్ లు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. టన్నె ల్సు, సబ్స్టేషన్లు, కెనాల్స్ పూర్తి చేసింది బీఆర్ఎస్.కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చి బటన్ నొక్కి సీతారామ ప్రాజెక్టు మేమే నిర్మించినమని చె ప్పుకుంటున్నారనీ ఆరోపించారు.
రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ దగ్గర మీ మం త్రులే నీళ్లు విడుదల చేసి నెత్తి మీద చల్లుకుంటున్నది నిజం కాదా.. ఒక రు ఏమో కాళేశ్వరం తిట్టుడు మరొ కరు కాళేశ్వరం మొక్కుడు.. 7000 కోట్లతో నువ్వు ప్రారంభించబోతున్న ఈ పథకం కాళేశ్వరం నీళ్లతో కాదా.మల్లన్న సాగర్ కట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అంట..

మల్లన్న సాగర్ 2008,2009లో రాజశేఖర్ రెడ్డి కట్టిండు అని అంటు న్నాడు.అనంతగిరి 1.70టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ అన్ని కలిపి ఐదు టీఎం సీలే.. ఐదు టీఎంసీలు మాత్రమే ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్ లో ప్రతి పాదించారు.మల్లన్న సాగర్ కెపా సిటీ 50 టీఎంసీలు.. కేంద్ర ప్రభు త్వానికి 2008లో డీపీఆర్ పంపితే 2012లో డీపీఆర్ ను తిప్పి పంపిం ది సీడబ్ల్యుసీ. ఈ ఐదు టి.ఎం.సీల సామర్థ్యంతో 16 ఎకరాలకు నీళ్లు పారవు. రిజర్వాయర్లకు కెపాసిటీ పెంచుకోండి అని డీపీఆర్ ను రిజెక్ట్ చేసింది సీడబ్ల్యూసీ.రాజశేఖర్ రెడ్డి బతికుంటే ఈ అబద్ధాలు విని సిగ్గు తో తలదించుకునేవాడనీ పేర్కొ న్నారు.సాగునీటి అవసరాల కోసం కేసీఆర్ గారు 50 టీఎంసీల మల్ల న్న సాగర్ నిర్మించారు. ఇదే రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ కట్టవద్దని 48 గంటలకు దీక్ష చేసిండు.2016లో మల్లన్న సాగర్ కట్టాలంటే ప్రజలం దరూ రెఫరండం తీసుకుని కట్టాలని దీక్ష చేశాడని ఆరోపించారు

మల్లన్న సాగర్ కడితే ఆ ప్రాజెక్టు కింద ఒక్కొక్క రైతుకు రెండు ఎకరా లు పండే భూమిని ఇవ్వాలి అని అన్నాడు. మూసిలో దాదాపు 300 ఇళ్లు ఖాళీ చేపించిండు రేవంత్ రెడ్డి.. అడ్డుకునే తెలివి నీది రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్కు అడ్డం పడ్డది నువ్వు.. మల్లన్న సాగర్ లో ప్రజలం దరినీ ఒప్పించి మెప్పించి 99 శాతం ప్రజలు కాన్సెంట్ అవార్డు ఇష్టపూ ర్వకంగా ఇచ్చారు. మూసిలో మొ న్న 300 ఇళ్లను కూలగొట్టిన రేవంత్ రెడ్డి.. చివరికి కేసీఆర్ కట్టించిన డబ ల్ బెడ్ రూములు మాత్రమే వాళ్ళకి ఇచ్చి ఒక రూపాయి కూడా ఇవ్వ లేదు.. మల్లన్న సాగర్లో భూమి కో ల్పోయిన వారికి అమ్ముకునే హక్కు లతో కూడిన 250 గజాల్లో సొంత ఇంటిని కట్టించామని తెలిపారు. రెం డున్నర లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చినం. 18 దాటిన వారి కి కూడా నష్టపరిహారం ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మూసిలో ఖాళీ చేయించిన వారికి 25 వేల చెక్కు ఇచ్చిండు.. ఆ చెక్కులు కూ డా బౌన్స్ అయినయ్. కేసీఆర్ దేశం లో ఎక్కడలేని విధంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్ నిర్వాసి తులకు కట్టించాడు. మూసి నిర్వా సితులకు 2013 చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఒక దీక్షతో మల్లన్న సాగర్ కట్టిండు. మల్లన్న సాగర్ ఈరోజు హైదరాబాదుకి, రై తులకు ఒక వరంగా మారింది.
నోరు ఉంది కదా అని గావుపెట్టినం త మాత్రాన అబద్ధాలు నిజాలు కావు.. నిజాలు అబద్ధాలు కావు అ ని అన్నారు.మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదన్న విషయాన్ని అబద్దంగా మార్చే ప్రయత్నం సీఎం చేస్తున్నాడని అన్నారు.
హైదరాబాదుకు బీఆర్ఎస్ ఒక చుక్క మంచినీళ్లు తేలేదు అని మరో అబద్ధం చెప్పిండనీ
మంచినీటి కోసం హైదరాబాదులో నీటి యుద్ధాలు జరిగేది. బిఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్లను హైదరాబాద్ మంచినీటి కోసం ఖర్చు చేశాం. మీరు ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై ఏడేళ్లయినా పూర్తి కాలేదు.
ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు మంచినీళ్లు తెచ్చే లైన్ లో రైల్వే, మిలిటరీ ల్యాండ్ల పర్మిషన్లు పెండింగ్ ఉంటే రెండు సంవత్సరాల్లో రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను ఒప్పించి మెప్పించి హైదరాబాద్కు వాటర్ సప్లై స్కీమ్ను పూర్తి చేశాము. కృష్ణ ఫేజ్ 4 పనులను కూడా పూర్తి చేసి కృష్ణ నీళ్లను కూడా హైదరాబాద్ తెచ్చింది కేసీఆర్ అని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 56 రిజర్వాయర్లు, 2600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినం.
ఓఆర్ఆర్ ఫేస్ వన్, ఫేస్ టూలో 2000 కోట్లు ఖర్చు చేసి ఓహెచ్ఎస్ఆర్ పైపులైన్లు వేసాము.
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలని.. భవిష్యత్తులో వందేళ్ల కోసం నాగార్జునసాగర్ నుండి 60 టీఎంసీల నీళ్లు తీసుకోవాలని సుంకిశాలను ప్రారంభించినం.
మీరు ప్రాణహిత చేవెళ్ల రంగారెడ్డి జిల్లాలో పెట్టింది 1,50,000 ఎకరాలకే.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఆరు లక్షల 50వేల ఎకరాలకు మేము ప్రతిపాదించాము.
వికారాబాద్, పరిగి, తాండూర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో లేవు. కృష్ణా నదిలో నీటి వాటా కోసం రంగారెడ్డి కృష్ణ పరివాహక ప్రాంతంలో వస్తుంది.. సప్లమెంటేషన్ చూపిస్తే ట్రిబ్యునల్ ముందు మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుందని,
కృష్ణ నదిలో మాకు వాటా ఉందని గ్రావిటీ ద్వారా ఉద్దండపూర్ రిజర్వాయర్ నుండి 6.5లక్షలు ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రతిపాదన చేశాం.
2014లో అసెంబ్లీలో బిల్లుపై చర్చలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నరో చూద్దాం.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 5000 కోట్లు ఖర్చు చేసి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నాడు. నిన్నేమో 2008- 9లో మల్లన్న సాగర్ రాజశేఖర్ రెడ్డి కట్టిండు అని మరో అబద్ధం చెపుతున్నాడు. సెక్రటేరియట్ కి కూడా పునాదిరాళ్లు నేనే మోసా అంటాడేమో అని ఎద్దేవ చేశారు. అమరవీరుల స్థూపానికి కూడా నేనే మేస్త్రి అని అంటాడు.
జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లను కూడా కాంగ్రెస్ కట్టిందని అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిందే లేదు.. ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా మా తాత కట్టిండు అని చెప్పుకుంటాడు.. అధికార మదంతోనో, ధన బలంతోనో తిమ్మినిబమ్మిని చేద్దామని చూస్తే జనం సహించరు తిప్పికొడతారు. జనం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.మంచి పనులు చేస్తే మేము సహకరిస్తాం. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు గనుక మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో నిర్మించిండు కాబట్టే నువ్వు హైద రాబాద్కి నీళ్లు తేగలుగు తున్నా వ్.152 మీటర్లకు అగ్రిమెంట్ ఉండంగా కూడా మేడిగడ్డకు ఎం దుకు పోయారని ఉత్తంకుమార్ రె డ్డి, రేవంత్ రెడ్డి నీ నిలదీశారు.
నేడు వారే నిజము ఒప్పుకున్నారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు అగ్రిమెంట్ ఉంది అని అంటున్నా రు.. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి అన్నారు కదా తెచ్చి చూపించండినీ నిలదీశారు. 148 మీటర్ల వద్ద బ్యా రేజీ కడితే కేవలం 50 టీఎంసీల కంటే మనం ఎక్కువ తీసుకోలేమనీ పేర్కొన్నారు.