Fraud Alert: ప్రజా దీవెన మంచిర్యాల: సింధూర మే నూరేళ్ల జీవితమన్నట్లు నమ్మ బలికి యువతిని నట్టేట ముంచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లాకు చెందినసాయి ప్రణీత్ (26) బెంగుళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఒక క్లినిక్లో పనిచేసే యువతి పరి చయం అయింది. ఇద్దరు ఒకే హాస్ట ల్లో ఉండేవారు. తన తండ్రికి గుండెపోటు వచ్చిందని సొంతూరు ఒడిశాకు వెళ్లిన యువతికి రోజు ఫోన్ చేసి సాయి ప్రణీత్ యోగక్షే మాలు అడిగేవాడు. ఇలా స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారిం ది.ప్రేమలో పడ్డాక కేరళ టూర్ వెళ్లి అక్కడ హోటల్లో నుదుటన సిం ధూరం పెట్టి పెళ్లి అయిపోయిందని యువతిని నమ్మించాడు.
2023లో ఇద్దరు షిరిడీ వెళ్ళినప్పుడు అక్క డ అబ్బాయి తల్లిదండ్రులను పరి చయం చేయడంతో ఆ యువతికి అతని మీద నమ్మకం మరింత పెరిగింది. 2024లో ఇద్దరు ఉద్యో గరీత్యా హైదరాబాద్ వచ్చి జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని నివసించారు. అయితే గత ఏడాది నవంబర్ లో చెల్లికి పెళ్లి కుదిరిం దని మంచిర్యాల వెళ్లిన యువకు డు తిరిగి రాకపోవడంతో యువతి కి అనుమానం వచ్చి అతన్ని నిల దీసింది. రూ.20 లక్షలు తీసుకోని మన బంధం మర్చిపోవాలని అత ను చెప్పడంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీ సులు యువకుడి మీద లైం గిక దాడి కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు.