Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

‘Game Changer’ pre-release: ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చి వెళ్తూ మృత్యుఒడిలోకి…

‘Game Changer’ pre-release: ప్రజా దీవెన కాకినాడ: ఆంద్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌కు వచ్చి వెళ్తూ ఇద్దరు యువకులు మృత్యు ఒడిలోకి వెళ్లిన సంఘ టన చోటు చేసుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందా రు. రాజమండ్రి సమీపంలో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు మృ తి చెందిన సంఘటన జరిగింది.

రాజమండ్రిలో శనివారం జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకి నాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యా క్టరీ వద్ద వ్యాను బలంగా ఢీకొనడం తో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చర ణ్‌కు బలమైన గాయాలు కాగా
మణికంఠ అక్కడికక్కడే చనిపోగా చరణ్ కాకినాడ జీజీహెచ్ తీసుకొ స్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందారు.