Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gandhamalla Anand Gowda: గురుకుల విద్యాలయాల్లో వున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి*

*గంధమల్ల ఆనంద్ గౌడ్*
*రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ ఓబీసీ మోర్చా*
Gandhamalla Anand Gowda: ప్రజా దీవెన, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12 నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలోనీ అన్ని గురుకుల విద్యాలయాల్లో వున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధ మల్ల ఆనంద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు…

ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300కు పైగా బీసీ గురుకులాలు సమస్యలను నిలయంగా మారాయని ఎద్దేవచేశారు..
అన్ని గురుకులాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించి, తగిన సంఖ్యలో మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయాలని అదే విధంగా నాణ్యమైన భోజనం అందించాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై తక్షణ చర్యలు తీసుకుని, వారి విద్యతో పాటు నిత్యావసరాలను తీర్చగల గురుకులాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.