Good Friday celebrated : ప్రజా దీవేన, కోదాడ:గుడ్ ఫ్రైడే(శుభశుక్రవారం) సందర్భంగా పట్టణంలోని స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చి నందు ప్రత్యేక ప్రార్థన వేడుకలను పాస్టర్ రెవరెండ్ యేసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా చర్చిలో సంఘస్తుల చేత యేసు ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలు ఏడుగురు వక్తలు మాట్లాడి ఏసుప్రభు యొక్క ప్రేమను చాటి చెప్పారు .
ఏసుప్రభు మనుషుల పాప క్షమాపణ నిమిత్తం కలవరి సిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తము ద్వారా లోక పాపములను కడిగి వేసి లోక పాపములనుమోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా అవతరించి ఉన్నాడని వారు కొనియాడారు అనంతరం సంఘ గాయని గాయకులు ప్రత్యేకమైన పాటలు పాడి దేవుని మహిమ పరిచారు మహిళలు యవనస్తులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి దేవుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేరమ్మ, సుమలత, కోటయ్య, జ్యోతి,శారా, మాజీ నడిగూడెంఎంపీపీ యాతాకుల జ్యోతి, కోదాడ మాజీక్రిస్టియన్స్ కో ఆప్షన్ సభ్యురాలు ఒంటెపాక జానకి యేసయ్య, ద్రాక్షవల్లి, జగ్గు నాయక్, జాన్ శ్యామ్ బాబు, రాంబాబు, విజయనంద్, మోజస్,తదితరులు పాల్గొన్నారు