Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pensioners: ప్రభుత్వo తీపికబురు, ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ మెడికల్ బిల్లులు

Pensioners: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు పె న్షన్లకు తీపి కబురు అందించింది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న రూ. 180.38 కోట్ల మెడికల్ రీయిం బర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ చేయడంతో ఉద్యోగులు, కమిషన ర్లు వర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా రు. ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26, 519 మందికి ఊరట లభించినట్ల యిoది. ఇదిలా ఉండగా గత ప్రభు త్వంలోని పెండింగ్ బిల్లులను సైతం క్లియర్ చేస్తూ డిప్యూటీ సీఎం మ ల్లు భట్టి విక్రమార్క సంచలన నిర్ణ యం తీసుకున్నారు.

తద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష నర్లకు ప్ర భుత్వం తీపి కబురు అం దించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియం బ ర్స్మెంట్ పెండింగ్ బిల్లుల మొత్తం 180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒకేసారి విడుదల చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడి కల్ రీయంబర్స్మెంట్ బిల్లులకు ప్రా ధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం మ ల్లు భట్టి విక్రమార్క పెండింగ్ రియం బర్స్మెంట్ బిల్లులు అన్నింటిని ఒకే సారి క్లియరెన్స్ చేయడం ద్వారా ఆ యా వర్గాలకు తీపి కబురు అందిం చారు.

అందులో భాగంగా గత ప్రభుత్వం కాలం లో 04- 03- 2023 నుంచి 20-06-2025 వ రకు పెండింగ్లో ఉన్న బిల్లులను క్లి యర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 26,519 మం ది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది.