Graduate Mlc thinmaar mallanna : పట్టభద్రుల పట్టా తీన్మార్ మల్లన్న కే
--నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీగా మల్లన్న గెలుపు --ఆది నుంచి ఆధిక్యత ప్రదర్శిస్తూ అంతిమంగా విజయం కైవసం --ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత సైతం మల్లన్నకే ఆధిక్యం --సీఈవో అనుమతితో ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి --సిటింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం కోల్పోయి భంగపడిన బిఆర్ఎస్
పట్టభద్రుల పట్టా తీన్మార్ మల్లన్న కే
–నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీగా మల్లన్న గెలుపు
–ఆది నుంచి ఆధిక్యత ప్రదర్శిస్తూ అంతిమంగా విజయం కైవసం
–ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత సైతం మల్లన్నకే ఆధిక్యం
–సీఈవో అనుమతితో ప్రకటించిన
ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి
–సిటింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం కోల్పోయి భంగపడిన బిఆర్ఎస్
ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా ( Mlc) కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ( thenmaar mallan na) విజయం సాధించారు. మూడు రోజుల ఉత్కంఠ భరిత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కోటా ఓట్లు ఎవరూ దక్కించుకోకపోవడంతో సాం కేతికoగా అంశాల ఆధారంగా తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిం చారు.
దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ( brs) తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి భంగపాటుకు గురైంది. మూడు రోజుల ఉత్కంఠ భరిత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎట్టకేలకు శానసమండలి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మా ర్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ విజయం సాధించడతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది.
ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేశ్ రెడ్డి కంటే భారీ ఆధిక్యంలో ఉండ డంతో మల్లన్నను విజేతగా ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీజేపీ ( bjp) అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కూడా మల్లన్న దాదాపు 18 వేల ఓట్ల ఆధిక్యతో కొనసాగుతుoడ దగా కోటా ఓటు లభించకపోవడంతో ఈసీ ఉన్నతాధికారుల అను మతి తీసు కున్న తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన ( Ro Hari Chandana) మల్లన్నను విజేతగా ప్రకటించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రె డ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ తరపున జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ ఉప ఎ న్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి మే 27న పోలిం గ్ జరగ్గా బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొ త్తం 4,63,839 ఓట్లకు 3,36,013 ఓట్లు పోలవ్వగా 25,8 24 ఓ ట్లు చెల్లకుండా పోయాయి.
మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేటప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు దక్కగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,248, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 43,318, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ (palakuuri ashok) కు 29,697 ఓట్లు లభిం చాయి. మొద టి ప్రాధాన్యంలో ఎవరికీ ‘కోటా’ ఓ టు 1,55,095 రాకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లె క్కింపు చేపట్టారు.
శుక్రవారం రాత్రి వరకు మూడో స్థానంలో ఉన్న ప్రేమేందర్రెడ్డి ఎలి మినే షన్ ప్రక్రియ కొనసాగగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదా పు 18వేల ఓట్లతో ముందంజలో ఉన్నా కోటా ఓటు రాకపోవడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం మల్లన్నను విజేతగా ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనుమతితో రిట ర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ ప్రకటించారు.
మా నాయకుల కార్యకర్తల సమిష్టి విజయo… కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తలoదరి సమిష్టి విజయ మని ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్ల న్న అన్నారు. శుక్రవారం ఎమ్మె ల్సీ కౌంటింగ్ సెంటర్ మీడియా పా యింట్ వద్ద ఆయన మాట్లాడుతూ పదేండ్ల నుంచి కష్టపడి పట్ట భద్రుల మనసుల్లో చోటు సంపాదిం చుకున్నామని చెప్పారు. తన విజ యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయం నూరు శాతం పట్టభద్రుల విజయం అన్నారు. తనకు టికెట్ ఇచ్చి న కాంగ్రెస్ పార్టీకి, గెలుపు కోసం సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు, తన బృంద సభ్యులకు ప్రత్యేక ధ న్య వాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా ప్రజ లకు జవాబుదారిగా పని చేస్తానని తెలిపారు. ఎక్కడ నిర్లక్ష్యం చేయ కుండా పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఓడినా నైతికంగా నాదే గెలుపు..సాంకేతికంగా ఓడినా నైతికంగా మాత్రం తానే గెలిచానని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఐదు గురు మంత్రులతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా తను గట్టిపోటీ ఇ చ్చానని చెప్పారు. తన పోరాటం ప్రజల కోసమేనని ఎల్లప్పుడూ ప్రజ ల మధ్యనే ఉంటానని అన్నారు. పార్టీలకు అతీతంగా చాలా మంది తనకు మద్దతు తెలిపారని, వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తు న్నానని అన్నారు. పోటీ చేసే అవ కాశం కల్పించిన బీఆర్ఎస్ అధి నేత కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు.
తొలిసారి కాంగ్రెస్ కైవసం… నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యు యేట్ స్టానాన్ని కాంగ్రెస్ తొలిసారిగా కైవసం చేసుకుంది. 2015లో కాంగ్రె స్ మద్దతుతో మొదటి సారి పోటీ చేసిన మల్లన్నకు చాలా త క్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. మళ్లీ 2021లో రాముల నాయక్ పోటీ చేసినప్పుడు 27, 588 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కేటీఆర్, హరీశ్ రావు, పలా. గట్టిగానే ఫైట్ చేశారు మల్లన్న మీద సొంత పార్టీ నేతలే అసం తృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ సోషల్ మీడి యాలో పెద్ద ఎత్తున చక్క ర్లు కొట్టిం ది. ఈ క్రమంలో పట్టభద్రులు మాత్రం అంతిమంగా మల్లన్న వైపే మొగ్గు చూపారు.
బీజేపీకి సైతం పెరిగిన ఓట్లు..గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు మొదటి నుంచి పెదవి విరిచినా 2021లో పోటీ చేసిన ప్పుడు పార్టీకి ఎదురుదెబ్బ తగిలిం దని, మళ్లీ ఉప ఎన్నికల్లోనూ ఆయ న్నే దించడంతో చాలా మంది పార్టీ నేతలకు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో బీజేపీకి 39,107 ఓట్లు రాగా, ప్రస్తుత ఉప ఎన్నికలో 43.956 వచ్చాయి. అప్పటితో పోలిస్తే 4,849 ఓట్లు మాత్రమే పెరిగినా మెరుగనే చెప్పాలి.
ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ సైతం ప్రభా వం చూపారు. విద్యావంతుడైన అశోక్ కేవలం పట్టభద్రులు మీద ఆశతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం లోకి దిగగా ఆయన కూడా దాదాపు ప్రధాన పార్టీ ల అభ్యర్ధులతో చివరి వరకు లెక్కింపు క్రతువు లో భాగ స్వామ్యమయ్యారు.