Telangana Formation Day : ప్రజా దీవెన నాంపల్లి జూన్ 3 మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 11 వసంతాలు పూర్తి చేసుకున్నది సంతోషం వ్యక్తం చేశారు.
అతిథిగా హాజరైన సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ రైతులు మంచి విత్తనాలు నాటుకొని అధిక దిగబడి సాధించాలని కోరారు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూజే నాంపల్లి మండలం అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు సింగిల్ విండో మాది చైర్మన్ నాంపల్లి హనుమంతు పట్టణ మాజీ వార్డ్ మెంబర్ కోరే కిషన్ కాంగ్రెస్ నాయకులు దుబ్బ యాదయ్య యాదమ్మ. కోరే జయరాం కస్తూరి గోవర్ధన్ కోర వెంకటయ్య అన్నిపాక హరీష్ గాదెపాక నాగరాజు తదితరులు పాల్గొని మిఠాయి పంపకాలు జరిపారు