Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Group 2 Exam: గ్రూప్ 2 పరీక్షలు వాయిదా..?

–తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
–రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

Group 2 Exam: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గ్రూప్ 2 పరీక్షలు (Group 2 tests) వాయిదా వేయనున్నారా అంటే అధికార వర్గాల నుంచి అవు ననే సమాచారం వినవొస్తుంది. రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సి ఉండగా ఈ పరీక్షలను వాయిదా వేయాలని గ్రూప్-2 పోస్టుల సంఖ్యను (No. of Group-2 Posts) పెంచాల ని డిమాండ్ (deamand) చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశం పై శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీ స్ కమిషన్‌ Telangana Public Service Commission) కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పరీక్షల ను వాయిదా వేయాలని పోస్టుల సంఖ్యను పెంచాలంటూ నిరసన, నిరాహార దీక్షలు సైతం చేస్తున్నారు విద్యార్థులు. విద్యార్థుల్లో ఆగ్రహం పెరిగిపోతుండటంతో నష్ట నివారణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నా హాలు చేస్తుందని సమాచారం. గ్రూ ప్ – 2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జులై 17వ తేదీ నుంచి ఆగస్టు 5 వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో నిరుద్యోగుల వినతి మేరకు పరీక్షలను వాయిదా (Adjournment)వేయా లని ప్రభుత్వం నిర్ణయించిందట. నేడో రేపో రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతు న్నాయి.

యధావిధిగా డీఎస్సీ..?
ఉద్యోగార్థులు డీఎస్సీ పరీక్షను (DSC Exam)సైతం వాయిదా వేయాలని డిమాం డ్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్ని కల ముందు హామీ ఇచ్చినట్లుగా మెగా డీఎస్సీని ప్రకటించాలన్నారు. డీఎస్సీ పోస్టులను (DSC posts) పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగార్థు లు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ పోరా టం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నా రు నిరుద్యోగులు. దీంతో డీఎస్సీ పరీక్ష సైతం వాయిదా పడే అవకాశం లేక పోలేదని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ డీఎస్సీ విషయంలో ఎలాంటి మార్పు లేకపోతే ముందు ప్రకటించిన విధంగా ఎలా విధిగా పరీక్ష జరగనుంది.