–స్పష్టమైన సమాచారంతో పోలీ సుల దాడులు
–ఆరు లీటర్ ల సారాయి, 90 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
–గుడుంబా తయారు చేస్తే బైండోవ ర్ కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు
Gudumba smuggling:ప్రజాదీవెన, జగిత్యాల: గుడుంబా రహిత జిల్లాగా జగిత్యాలను (jagityala) చూడాలనే లక్ష్యంతో ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలు ఇవ్వగా శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై (gudumba)పోలీసులు, ఎక్సైజ్ శాఖ వారితో సంయుక్తంగా దాడులు నిర్వహించారు.ఈ దాడిలో 6 లీటర్ల గుడుంబాను, 90 లీటర్ల బెల్లం పానకం (geggery liquid)స్వాధీనం చేసుకొని గుడుంబా స్థావరాని ధ్వంసం చేశారు. ఎస్సై అనిల్ మాట్లాడుతూ…ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుడుంబాకు అలవాటు పడి ఎంతోమంది కుటుంబాలను చిన్నబిన్నం చేసుకొని చివరకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. అంతే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా (gudumba) తయారీ చేస్తునట్టు తెలిసినా, అమ్మినా వెంటనే పోలీసు స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గొప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వినోద్ రాథోడ్, ఇబ్రహీంపట్నం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.