–హర్షం వ్యక్తం చేసిన కార్యకర్తలు, అభిమానులు
Gummala Mohan reddy: ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది.27 మందికి ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కింది.వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా కమిటీని ఏఐసీసీ ప్రకటించింది.ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులను భర్తీ చేసింది. కార్యవర్గంలో ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు కల్పించింది.
అందులో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం లభించింది. గుమ్ముల మోహన్ రెడ్డికి వైస్ ప్రెసిడెంట్ ప్రకటించటంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.