Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Ila Tripathi : హాలియా ఏటిసిని ఆకస్మికoగా తని ఖీ చేసిన జిల్లా కలెక్టర్, అందుకు ఆదేశాలు జారీ 

Collector Ila Tripathi : ప్రజా దీవెన, హాలియా: నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా లో ని అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) ప్రారంభోత్సవానికి సిద్ధం చే యాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డిలు అధికా రులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు హాలియా ఏటిసిని ఆకస్మికoగా తనిఖీ చేశా రు.

 

ఏటిసిలో వివిధ మెషినరీ ఏర్పాటు చేసినందున ప్రారంభానికి చర్యలు తీసు కోవాల ని ఏటీసీ ప్రిన్సిపల్ మల్లికార్జునను ఆదేశించారు. సా ధ్యమైనంత త్వరగా ఏటీసీ ప్రారం భానికి చర్యలు తీసుకోవాలని చె ప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ము ఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అ న్ని ఏటిసిల ప్రారంభం సందర్బంగా హాలియ ఏటిసిని ప్రా రంభించేలా చూస్తానని ఎంఎల్ ఏ తెలిపారు.

 

ఏటిసిలో ఉ న్న సౌకర్యాలు, విద్యా ర్థుల సంఖ్య, బ్యాచులు తదితర వివరాలను అ డిగి తెలుసుకున్నా రు. ట్రా న్స్ఫార్మ ర్ కు విద్యుత్ కనె క్షన్ ఇవ్వాలని, రోబోటిక్ ఎక్సలె న్సీ,యంత్ర సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదే శించారు.

అనంతరం ప్రస్తుత ఐటిఐలో జిల్లా కలెక్టర్ ,ఎమ్మెల్యేలు నాగార్జునసా గర్ నియోజకవర్గ పరిధిలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పై సమీక్ష నిర్వహించారు.నియోజక వర్గంలో సాంకేతిక సమస్య కార ణంగా కొంతమంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు కాలేదని, తిరిగి వారికి దరఖాస్తు చేసుకునే అ వకాశం కల్పించాలని, అనంతరం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమా న్ని చేపట్టాలని శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు.

 

అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబం ధించి నియోజకవర్గానికి కేటాయిం చిన ఇండ్లను మండలాల వారిగా ఆయా గ్రామాల్లో మంజూ రైన వివ రాల ఆధారంగా ఇండ్లు త క్కువ మంజూరు అయిన గ్రామా లకు సం బంధించి మరోసారి వెరి ఫికేషన్ చేయించి కేటాయించిన ఇం డ్లన్నీ గ్రౌం డ్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ సబ్ లెక్టర్ నారాయణ అమిత్, గృహ ని ర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఇం చార్జ్ తహసీల్దార్ రఘు, ప్రిన్సి ప ల్ మల్లి కార్జున్ రావు తదితరులు ఉన్నారు.