–19 నెలలుగా రైతన్నను అరిగోస పెట్టినoదుకు క్షమాపణలు చెప్పాలి
–మాది రైతు సంక్షేమo అయితే కాంగ్రెస్ ది రైతుసంక్షోభ ప్రభుత్వo
–కేసీఆర్ నాట్లకునాట్లకు ఇస్తే, మీ రు ఓట్లకు ఓట్ల కు మధ్య ఇచ్చారు
–ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
Harish Rao : ప్రజా దీవెన,హైదరాబాద్: తెలంగా ణ స్థానిక సంస్థల ఎన్నికల సంద ర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు భ రోసా’ పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపాలని మాజీ మంత్రి తన్నీరు హ రీశ్ రావు డిమాండ్ చేశారు. గడిచి న 19 నెలల కాలంలో రైతన్నను అ రిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్ర భుత్వం క్షమాపణలు చెప్పాలన్నా రు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చె ప్పి రూ.12 వేలకే పరిమితం చేయ డం మోసం చేయడమేనని అన్నా రు. గత వానకాలం రైతు భరోసా ఎ గ్గొట్టి, యాసంగిలోనూ ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పే రిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమేనని ఆక్షేపించా రు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రై తులకు అందించిన ‘రైతు భరోసా’ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు ప్రభుత్వం ‘రైతు భరోసా’ విజ యోత్సవ సభలను ప్లాన్ చేస్తోంద ని, అయితే విజయోత్సవాలు కాద ని, రైతులకు క్షమాపణలు చెప్పాల ని హరీశ్రావు అపహాస్యం చేశారు. మంగళవారం ఆయన తన వ్య క్తిగ త సామాజిక మాధ్యమo ఎక్స్వే ది కగా ఈ విషయాన్ని రాసుకొచ్చారు.
అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్నాలకే పరిమితం చేశారని హరీ శ్రావు ఆరోపించారు. రూ.1,200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినం దుకా, ప్రీమియం చెల్లించక రైతు బీ మా అమలు ప్రశ్నార్థకం చేస్తున్నం దుకా, పంట బీమా అని చెప్పి ఉసు రుమనిపించినందుకా దేశానికి అ న్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందు కా రైతు భరోసా విజయోత్సవాలు అంటూ సెటైర్లు వేశారు. లగచర్ల , రాజోలి రైతుల చేతుల చేతులకు బేడీలు వేసినందుకా. ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుం డా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొ త్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వనం దుకా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరపనందుకా అని ఎద్దేవా చేశారు. మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నం దుకా ఎందుకు సంబురాలు చేస్తు న్నావు రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నిం చారు.
చితికిపోయిన అన్నదాత బతుకు లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన నాటి నుంచి రై తులు చితికిపోతున్నారని, ఇప్పటి వరకు అన్నదాతల బతుకులు సం క్షోభంలో కూరుకుపోయాయని హరీ శ్ రావు అన్నారు. బీఆర్ఎస్ పాల నలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న నేడు ప్రభుత్వ పథకా లు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నాడని తెలిపారు.తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ది రైతు సంక్షోభ ప్రభుత్వ మని పేర్కొన్నారు. కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్యపెట్టాలని చూ స్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న కాం గ్రెస్ జిమ్మిక్కులను రైతులు నమ్మ రని అన్నారు. రైతులను కన్నీళ్లు పె ట్టించినందుకు, ఉసురు తీసుకు న్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పాలని, ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చే యాలని హరీశ్ రావు డిమాండ్ చే శారు.