–తెలంగాణలో కనీసం కోవిడ్ కిట్లు లేవు
–ప్రభుత్వంలో పనిచేసే వారు విష యాలు తెలుసుకోవాలి
— మాజీ మంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే తన్నీరు హరీష్రావు ఎద్దేవా
Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే తన్నీరు హరీష్రావు విమ ర్శలు చేశారు. వైద్య కళాశాలల్లో కనీస వసతులు లేవని ఎన్ఎంసీ లేఖ రాసిందని గుర్తుచేశారు. తెలం గాణలో కనీసం కోవిడ్ కిట్లు లేవని మండిపడ్డారు. దేశంలో 90వేల కరో నా కేసులు ఉంటే రాష్ట్రంలో కనీసం కోవిడ్ టెస్ట్లు కూడా చేయడం లేద ని ధ్వజమెత్తారు.సోమవారం తెలం గాణ భవన్లో హరీష్రావు మీడి యాతో చిట్చాట్ చేశారు.
రేవంత్ ప్రభుత్వానికి ఏ విషయం లోనూ స్పష్టత లేదని మాజీ మంత్రి హరీష్రావు చెప్పారు. రుణమాఫీ, రైతుభరోసా, యువవికాస ఇలా అన్ని అంశాల్లోనూ ప్రభుత్వానికి స్ప ష్టత లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రంలో చేసిందేమీ లేదని, కానీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం క్యాంపు కార్యాలయం మాత్రం సిద్ధ మైందని చెప్పుకొచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం కోసం రోడ్డు ను కూడా విస్తరణ చేస్తున్నారని అ న్నారు. నలుగురు ఎమ్మెల్యేలు హై కోర్టుకి వెళ్లడం అంటే సొంత ప్రభు త్వంపై తిరుగుబాటు అన్నట్లేనని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే 30 టీ ఎంల నీళ్లు హైదరాబాద్కి ఎక్కడ నుంచి తీసుకువస్తారని మాజీ మం త్రి హరీష్రావు ప్రశ్నించారు. గోదా వరి బనకచర్ల విషయంలో ఏపీ ప్ర భుత్వం ఇచ్చిన డాక్యుమెంట్, లేఖ ల ఆధారంగానే తాను మాట్లాడాన ని స్పష్టం చేశారు. 90శాతం విష యాలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. రేవంత్ ప్రభు త్వంలో పనిచేసే వారికి ఈ విష యాలు తెలియవు, నేర్చుకోరని ఎద్దేవా చేశారు. గోదావరి – బనకచ ర్ల గురించి ఇప్పటికే చాలాసార్లు తా ను మాట్లాడానని, కేంద్రమంత్రి కిష న్రెడ్డికి కూడా లేఖ రాశానని గు ర్తు చేశారు. తాను ఉన్న వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ నేతలు లీకులు అంటూ ఏవేవో మాట్లాడుతున్నా ర ని హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.