–భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం
–వరద నీటితో రహదారులన్నీ జలమయం
–ముంపులో గ్రామాలు, చందర్ల పాడులో బైక్ తో కొట్టుకుపోయిన యువకుడు
Heavy rains: ప్రజా దీవెన, విజయవాడ: అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లా అంతటా భారీ వర్షాలు (Heavy rains) పడుతున్నాయి. డ్రైన్లు పొంగిపొర్లు తున్నాయి. వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందు లకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా. ఏ. కొండూరు మండలం లోని తండాలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు (the people) ఇబ్బందులకు గురవుతున్నారు.
ఏ.మండలం మండలంలోని పలు చోట్ల ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవ హిస్తోంది. తిరువూరు రూరల్ మండ లం లక్ష్మీపురం – విసన్నపే ట ప్రధాన రహదారి (main road)అలుగుపై వరద నీరు ప్రవహిస్తోంది. తిరు వూరు మండలం చౌటపల్లి – జి.కొ త్తూరు విప్లవ వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అత్యధికంగా బంటుమిల్లి మండ లంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం, కంకిపాడు మండలం 17, గుడివా డ పెనమలూరు 16, పెదపారు పూడి, ఉయ్యూరు 15, పామర్రు, ఉంగుటూరు, నందివాడ 14, పమిడి ముక్కల 13, గుడ్లవల్లేరు, గన్నవరం, మచిలీపట్నం 12, తోట్లవల్లూరు, మొవ్వ, గూడూరు 11, పెడన, బాపులపాడు 10, కోడూరు, ఘంటసాల, కృత్తివెన్ను 8, నాగాయలంక 7, చల్లపల్లి, అవ నిగడ్డ 6, మోపిదేవి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.
ఎన్టీఆర్ జిల్లాలో దంచికొడుతు న్న వానలు..
అత్యధికంగా జి. కొండూరు మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం(rainfall). ఇబ్రహీంపట్నం, మైలవరం 18, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, (Vijayawada East, Vijayawada West,) విజయవాడ రూరల్ 17, ఎ. కొండూరు 12, కంచికచర్ల చందర్లపాడు, రెడ్డి గూడెం, నందిగామ, వీరులపాడు 10, వత్సవాయి 9, జగ్గయ్యపేట తిరువూరు, విస్సన్నపేట మండలాల్లో 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటికి రావొద్దని కలెక్టర్ జి. సృజన విజ్ఞప్తి. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు ఆదేశం.అలాగే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే బైక్తో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి.. బైక్తో సహాకొట్టుకుపోయాడు. చివరకు చెట్టును పట్టుకుని వరద నీటిలో ఆ వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే గ్రామాస్థులు చూసి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే వరద ప్రవాహానికి బైక్ కొట్టుకుపోయింది.
ఆకట్టుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ (ai)… విధి నిర్వా హాణలో పోలీస్ శాఖ అత్యంత విలువైన పాత్ర అనేది అందరికి తెలుసు.అలాంటి పోలీస్ శాఖలో (Police Department) నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు పొంగు తున్న వాగులు కాలువలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గుంటూరు విజయవాడ ప్రధాన రహాదారి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వరద నీరు రోడ్డుపైకివచ్చి ట్రాఫిక్ అంతరాయం అని విషయం తెలుసుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితి స్వయంగా రంగంలోకి స్థానికుల సహాయంతో వాహానాలను జాగ్రత్తగా పంపే ప్ర యత్నం అటుగా ప్రయాణం చేస్తు న్న వారితో సెభాష్ పోలీస్ అనేలా చేశారు. తమ ఆరోగ్యం ముఖ్యం కాదని ప్రజలను సేఫ్టీగా (safety)ఇళ్ళకు పంపాలని ఆయన విధి నిర్వహ ణకు సెల్యూట్. ఆయన ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు వాహానాలలో వచ్చే వారు రావద్దని 2 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవాహం ఉందని అప్రమ త్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరం అయితే తప్పించి బయటకు రావద్దని అసలు ప్రయా ణాలను వాయిదా వేసుకోవాలని హితవు పలికారు.
ఇళ్లలోంచి బయటకు రావద్దు
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ డీకే బాలాజీ (Collector DK Balaji) అప్రమత్తం చేశారు. వర్షాల వల్ల ప్రజలెవ్వరూ ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. అలాగే టెలీకాన్ఫరెన్స్లో అధికారులకు కలెక్టర్ బాలాజీ (Collector DK Balaji) పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడి యాతో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల పై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. లంక గ్రామాల ప్రజల కోసం నెల రోజుల సరిపడా నిత్యావసర వస్తు వులను సిద్ధం చేశామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. అత్యవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పున రావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నామని కలెక్టర్ బాలాజీ వెల్ల డించారు.