Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Honeytraping :హనీట్రాప్‌ వ్యవహారంపై పెను దుమారం

Honeytraping: ప్రజా దీవెన, బెంగళూరు: కర్ణాటకలో మంత్రు లు సహా అనేక మంది ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగు తోన్న ’హనీ ట్రాప్‌’వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ స్థాయి నేతలు సహా 48 మంది రాజకీ య నాయకులు ఇందులో బాధితులుగా ఉ న్నారంటూ ఓ మంత్రి చేసి న వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై శుక్రవారం కర్ణాటక అ సెంబ్లీ దద్దరిల్లింది. సమావేశాల వేళ ప్రతిపక్ష భాజపా నేతలు ఈ అం శాన్ని లేవనెత్తడంతో తీవ్ర గందర గోళ వాతావరణం నెలకొంది.

దాంతో సభా కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది భాజపా ఎమ్మె ల్యేల పై సస్పెన్షన్‌ విధిస్తూ తీర్మానం చేశారు. ఆరు నెలల పాటు వారిపై సస్పె న్షన్‌ వేటు వేస్తున్నట్లు స్పీకర్‌ వెల్లడిoచారు. సస్పెన్షన్‌ ఉత్తర్వుల ప్రకా రం వేటుకు గురైన సభ్యులు అసెం బ్లీ హాల్‌, లాబీ, గ్యాలరీలోకి ప్రవేశిం చకూడదు. వారు ఏ స్టాండిరగ్‌ క మిటీ సమావే శాల్లో పాల్గొనకూడదు. అసెంబ్లీ ఎజెండాలో వారి పేర్ల తో ఎలాంటి అంశం లిస్ట్‌ కాకూడ దు. ఈ సమయంలో వారికి రోజూ వారీ భత్యా లు కూడా అందవు.ఇక సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బలవం తంగా బయటకు తరలించారు.

దీనిపై బిజెపి తీవ్రంగా స్పం దించింది. విచారణ కోరితే సస్పె న్షన్‌ వేటు వేయడం, అదికూడా ఆరునెలలు వేయడం దారుణమ న్నారు. సిద్దరామయ్య నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ప్రభు త్వం నిజాలు దాస్తోందని విమర్శిం చారు. సంచలనంగా మారిన ’హనీ ట్రాప్‌’ వ్యవహారాన్ని శుక్రవారం సభ లో భాజపా నేతలు లేవనెత్తారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్‌ చేయడాన్ని విమర్శిస్తూ.. స్పీకర్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. భాజపా నేతల తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఒకసారి కేసు నమోదై.. దర్యాప్తు ప్రారంభమైతే హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు- తేలినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్టాన్ర్రికి చెందిన అనేకమంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకు పోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న ఇటీవల అసెంబ్లీలో పేర్కొనడం తీవ్ర చర్చనీయాం శమైంది. తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు.

అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నా రన్నారు. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్‌ జార్కిహోళీ మాట్లాడుతూ.. ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్‌ యత్నం జరి గిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, ఇది రాష్టాన్ర్రికి కొత్త కాద ని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటు న్నారని పేర్కొన్నారు.