–కోసప్రాణాలతో కొట్టుమిట్టాడు తున్న మరో 60 మంది
–తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియ స్
–జిల్లా కలెక్టర్ బదిలీ,జిల్లా ఎస్పీ సస్పెండ్
–మృతులు ఒక్కరికి రూ.10 లక్షలు నష్ట పరిహారం ఇస్తున్నట్లు ప్రకటన
Hooch Tragedy: ప్రజా దీవెన, తమిళనాడు: తమిళనాడులోని (Tamil Nadu) కల్లకురిచ్చిలో (Kallakurichi) కల్తీ నాటుసారా మహమ్మారి బారిన ఏకంగా 37 మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మంది కోసప్రాణా ల మధ్య కుట్టుమిటాడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin)అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కల్లకురి చి కలెక్టర్పై బదిలీ వేటు వేయడంతో పాటు ఎస్పీని సస్పెండ్ చేశారు. కాగా ఈ ఘటనపై స్టాలిన్ గురువారం అసెంబ్లీలో మాట్లాడా రు. దీనిపై విచారణ సిబిఐకి అప్ప గించామన్నారు. ఈ కేసులో ఇప్ప టికే ఇద్దర్ని అరెస్ట్ (ARREST) చేశామన్నారు. ఈ జిల్లాలోని అన్ని సారా దుకాణా లను మూసివేయించామని, స్టాక్ పాయింట్లలో ఉన్న సారాను పరీక్షల కోసం పంపామని చెప్పారు.ఈ సం దర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ రూ.10 l లక్షల చొప్పు న పరిహారం ప్రకటించారు. ఆస్పత్రు ల్లో (HOSPITAL) చికిత్స పొందుతున్న వారికి రూ. 50,000 ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోకుల్ దాస్ నేతృత్వంలో కమిషన్ ఏర్పా టు చేశామని తెలిపారు. 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించా మన్నారు.