Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Farmers Welfare : రైతులు బాగుంటే సమాజం బాగుంటుంది

–ఎదుల్ల రిజర్వాయర్ నుండి శివ న్నగూడెంకు నీటిని తీసుకొస్తాం
–నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు
–విత్తన సంచుల పంపిణీ కార్యక్ర మంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Farmers Welfare : ప్రజా దీవెన మునుగోడు: రైతు బా గుంటేనే సమాజం బాగుంటుందని, రైతుకు ఎంత చేసిన తక్కువేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రజా ప్రభు త్వం పాటుపడుతుందని చెప్పారు. సోమవారం మునుగోడులోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన రైతులకు నాణ్య మైన విత్తనాల చిరుసంచుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, రై తులకు నాణ్యమైన విత్తన చిరు సంచులను అందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక మునుగోడు ని యోజకవ ర్గంలోని శివన్నగూడెం రిజర్వాయర్ కు నీటిని తరలించే విషయంలో తాను చొరవ తీసుకుని 1800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చే శామని అన్నారు. అటు శివన్న గూ డెం రిజర్వాయర్ నుండి ఇటు బ్రా హ్మణ వెల్లంల రిజర్వాయర్ నుండి మునుగోడు నియోజకవర్గంలో ప్ర తి ఎకరాకు రెండు పంటలు పండిం చే విధంగా నీరందించటమే ప్రధాన ధ్యేయమన్నారు.

నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రం గా నష్టపోతున్నారని నకిలీ విత్తనా లు పంపిణీ చేసే వాళ్ళని సహించ బోమన్నారు. వాళ్ళ లైసెన్సులు ర ద్దుచేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధి కారులను ఆదేశించారు. నకిలీ విత్త నాల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అసలు ని ర్లక్ష్యంగా వ్యవహరించొద్దని వ్యవ సాయ శాఖ అధికారులకు సూచిం చారు.ప్రజా ప్రభుత్వం రైతు పక్షపా త ప్రభుత్వమని ఉచితంగా నాణ్య మైన విత్తన సంచులను పంపిణీ చే యడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారా యణ, డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి ల తో పాటు మునుగోడు వ్యవసాయ శాఖ ఏడిఏ వేణుగోపాల్, మానిట రింగ్ అధికారి డాక్టర్ లక్ష్మీ పూజ, మునుగోడు వ్యవసాయ అధికారి పద్మజ లతో పాటు రైతులు పాల్గొ న్నారు.