Saligouarram project : శాలిగౌరారం ప్రాజెక్టు ఫీడర్ ఛానల్ హెడ్ వర్క్స్ శట్టర్లను తక్షణమే ఏర్పాటు చేయాలి.
–భువనగిరి ఎం పి చామల కిరణ్ కుమార్ రెడ్డి..
*ఎమ్మెల్యే లు వీరేశం, సామేల్ తో కలిసి ఫీడర్ ఛానల్ ను పరిశీలన..
Saligouarram project : ప్రజా దీవెన శాలిగౌరారం : జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి, ఫీడర్ ఛానల్ పటిష్టం కొరకు కృషి చేస్తానని భువనగిరి ఎం పి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.శాలిగౌరారం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన ఫీడర్ ఛానల్ ను రామన్నపేట మండలం మూసీ నది సమీపం లోని పల్లివాడ హెడ్ వర్క్స్ ను,సూరారం, తుర్కపల్లి గ్రామ సమీపం లోని హెడ్ వర్క్స్ శట్టర్లను,శాలిగౌరారం ప్రాజెక్టు ను సోమవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్ సంబంధిత అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. మూసి నది నుంచి వరద నీరు ఉదృతంగా వస్తున్నా ఫీడర్ ఛానల్ ద్వారా ప్రాజెక్టు లోకి ఎందుకు సంక్రమంగా వెళ్లడం లేదని అధికారులను ఎం పి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.శెట్టర్లు, కాలువ అద్వానంగా ఉన్న మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను నిలదీశారు. శాలిగౌరారం ఫీడర్ ఛానల్ పరిధిలో ఉన్న హెడ్ వర్క్స్ శటర్ల కు, రామాంజపురం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి, ప్రాజెక్టు కట్ట అభివృద్ధికి గాను గత నాలుగు సంవత్సరాల క్రితం మిషన్ కాకతీయ కింద 5 కోట్ల 10 లక్షలు మంజూరయ్యాయని అందులో కేవలం 2కోట్ల 10 లక్షల రూపాయలు పనులు జరుగాయని,మిగిలిన 3 కోట్ల రూపాయల పనులను 15 రోజుల లోపల కాంట్రాక్టర్ తో పూర్తి చేయించాలని ఐబీ అధికారులను ఎం పి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.నీటిలోని గుర్రపు డెక్కఆకు ను తొలగిస్తూ పల్లివాడ, సూరారం, తుర్కపల్లి వద్ద శెట్టర్లకు 15 రోజుల లోపు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఫీడర్ ఛానల్ ను పూర్తిగా సిమెంట్ తో లైనింగ్ తో నిర్మించేందుకు,
శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరును అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ప్రాజెక్టు అభివృద్ధి పనులకు,పెండింగ్ లో ఉన్న బిల్లు రావడానికి తాను సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడుతానని అన్నారు.ఫీడర్ ఛానల్ నుంచి కొంతమంది అక్రమంగా నీటిని లిఫ్టింగ్ చేసి చేపల చెరువుల నిర్మిస్తున్నారనే పిర్యాదులు వచ్చాయని, అటువంటి వారిని గుర్తుంచి కేసులు నమోదు చేయాలన్నారు.
శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి అక్రమంగా నీటిని తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.సూర్యాపేట జిల్లా నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టు ను నల్లగొండ జిల్లా నీటి పారుదల శాఖ లో మార్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.ఈ కార్యక్రమం లో ఐబీ ఈ ఈ జెల్లా సత్యనారాయణ, డిఈ ఎం. సత్యనారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నూక కిరణ్ కుమార్ యాదవ్,శాలిగౌరారం మార్కెట్ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, కార్యదర్శి గూని వెంకటయ్య,సింగల్ విండో వైస్ ఛైర్మెన్ చామల మహేందర్ రెడ్డి, వేముల గోపినాథ్,రైతు సంఘం నాయకులు చామల వెంకటరంగా రెడ్డి, చాడ రమేష్ చందర్ రెడ్డి, నాయకులు చామల వాసుదేవరెడ్డి, జయపాల్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు చింత ధనుoజయ్, షేక్ ఇంతియాజ్ అహ్మద్, దండ అశోక్ రెడ్డి,నోముల జనార్దన్,వడ్లకొండ పరమేష్, కట్టంగూరి సురేందర్ రెడ్డి,గంట్ల వేణుగోపాల్ రెడ్డి,బొల్లికొండ గణేష్,జీడికల్లు, బోడ అరుణ్ కుమార్, ప్రాజెక్టు కాంట్రాక్టర్ వెంకటరెడ్డి,ఐబీ ఏ ఈ లు అమర్, విక్రమ్,వర్క్ ఇన్స్పెక్టర్ రజినీకాంత్ తదితరులు ఉన్నారు.