India – Israel: ప్రజా దీవెన న్యూ దిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర పోరు వల్ల పశ్చి మాసియా భగ్గుమంటోంది. నిన్న ఇరాన్ లోని అణుస్థావరాలపై ఇజ్రా యెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పే రుతో దాడులు చేసింది. ఈ దాడు ల వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా ఓ మ్యాప్ను షేర్ చేసింది. షేర్ చేసిన మ్యాప్లో జమ్మూకశ్మీర్ను పాకిస్థాన్ భూభాగం లో చూపిండం భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. దీనిపై భారత్ లోని నెటిజన్లు తీవ్రస్థాయి లో మండిపడ్డారు. ఈ పోస్టును వెం టనే ఉపసంహరించుకోవాలని ఇ జ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెత న్యాహుకు పలువురు నెటిజన్లు ట్యాగ్ చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో ఐడీఎఫ్ రియాక్ట్ అయింది. ఇది కేవ లం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదాహరించడం కోసం చేసిన పోస్టు మాత్రమేనని ఇందు లో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశాల సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమైందని పే ర్కొంది. ఈ తప్పిదానికి క్షమాపణ లు కోరుతున్నామని మరో పోస్టు చేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.