Indian Government :ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకి స్థాన్పై తీవ్ర చర్యలు చేపడుతోన్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణ యం తీసుకుంది. హోంమంత్రి త్వ శాఖ సిఫార్సులతో పాకిస్థాన్కు చెం దిన 16 యూట్యూబ్ చానళ్లను నిషేధించింది.
వీటిలో డాన్, సామా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి, ఆస్మా షిరాజీ, ఉమర్ చీమా, ము నీబ్ ఫరూఖ్, బోల్ న్యూస్, రాఫ్తా ర్, సునో న్యూస్, పాకిస్థాన్ రిఫరె న్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి చానళ్లు ఉన్నాయి. వీటన్నిం టికీ కలిపి మొత్తం 6.3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
పహల్గాం దాడి తర్వాత ఈ చాన ళ్లు భారత్పై విషం కక్కుతున్నా యని, రెచ్చగొట్టేలా తప్పుడు వార్త లు ప్రసారం చేస్తున్నాయన్న కార ణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీ సుకుంది. పహల్గాంలో 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీని ఉగ్రవా దులు కాల్చి చంపిన తర్వాత భార తదేశం, దాని సైన్యం, భద్రతా సంస్థ లను రెచ్చగొట్టేలా ఇవి వార్తలు ప్ర సారం చేస్తున్నాయి.
అదే విధంగా సున్నితమైన కంటెం ట్పై తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చే స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభు త్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీ సుకుంది.