Innovative protest: ప్రజా దీవెన, రాజస్థాన్: వరకట్న వే ధింపుల కేసు పెట్టిన భార్య ఇంటి ఎ దుటే భర్త టీ స్టాల్ పెట్టి వినూత్న ని రసన తెలిపిన ఘటన రాజస్థాన్ లో సంచలనం సృష్టించింది. కృష్ణ కుమార్ దకాడ్ అంతా పట్టణంలోని తన అత్తమామాల ఇంటి ఎదుట టీ స్టాల్ పెట్టి దానికి కేసు నంబర్ ‘498 A’ అని పేరు పెట్టాడు. అతడి భార్య తనపై పెట్టిన కేసు నెంబర్ ని టీ స్టా ల్ కు పేరు పెట్టడం గమనార్హం. దకా డ్ చేతికి సంకెళ్లు వేసుకుని హోటల్ కు ల్కు టీ తాగేందుకు వచ్చిన వారి కి టీ అందిస్తున్నాడు. అతని టీ స్టా ల్ చుట్టూ ఉన్న బ్యానర్లలో, పోస్టర్ల లో ‘జబ్ తక్ నహీ మిల్తాన్యాయ్, తబ్ తక్ ఉబల్లి రహేగీ చాయ్’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా అత డు 2018లో మీనాక్షి మాళవ్ ను వి వాహం చేసుకొని ఇద్దరూ కలిసి తే నెటీగల పెంపకం వ్యాపారం చేశా రు. ఈ క్రమంలో ఆయన భార్య 20 22లో చెప్పా పెట్టకుండా ఇంటిని వి డిచి వెళ్లిపోయింది. అనంతరం భర్త పై వేధింపుల కేసు పెట్టింది.
కాగా ఒక తప్పుడు కేసు కారణంగా అంతా నాశనమైంది. మూడు సంవ త్సరాలుగా నేను అంతాలో న్యా యం కోసం కోర్టు చుట్టూ తిరుగుతు న్నాను. నాపై ఆధారపడి ఉన్న వృ ద్ధ తల్లి ఉంది. ఆమె కోసం బతుకు తున్నానని కృష్ణ ఓ జాతీయ మీడి యా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు. మీనాక్షి మాలావ్ మాత్రం నేను విడాకులకు సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించడం గమనా ర్హం.